సిద్దిపేటలో టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు బాల్క సుమన్, కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అబద్ద ప్రచారం.గొెబెల్స్ బ్రతికి ఉంటే బీజేపీ ప్రచార తీరు చూసి ఉరి వేసుకుంటాడు. 2014 లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాయి. హుజూరాబాద్ లో అసలు బీజేపీ వాళ్లు…
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డ ఆయన.. మంత్రి పేర్ని నాని… బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణం అన్నారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన ఆయన.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం…
ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. వారు బీజేపీ అయినా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట, గుర్తుంచుకోవాలని.. రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు… పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో…
కరీంనగర్ జిల్లా.. ఇళ్ళందకుంట మండల కేంద్రంలోని 5,6,7 వార్డుల్లోని దళిత కాలనీల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళిత భస్తిల్లో ముఖ్యంగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ ఎప్పుడు దళితులను పట్టించుకోలేదు అని అన్నారు మాకు ఒక్క ఇళ్లు కూడ ఇవ్వలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పి ఇళ్లు ఇప్పించాలని దళితులు నాతో చెప్పారు. ఇళ్ళందకుంటలో పక్క ఇళ్లు…
పైన పటారం.. లోన లోటారం. తెలంగాణ బీజేపీలో ఇదే పరిస్థితి ఉందట. ఉన్న కొద్దిమంది నేతలూ ఒక్కమాట మీద లేరట. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడొకరు ఆ సమస్యకే మందు పూసి వెళ్లారట. కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్టు టాక్. మరి.. ఆయన మాటలు కమలనాథుల చెవికి ఎక్కాయా? పార్టీ నేతల మధ్య ఉన్న ఇబ్బందేంటి? బీజేపీలో ముఖ్యనేతల మధ్య గ్యాప్ ఉందా? శరీరానికి దెబ్బ తగిలితే మందు రాస్తారు. చికిత్స చేస్తారు. అదే మనసుకు గాయమైతే..? కోలుకోవడానికి…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీతారామన్ పాల్గొననున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో నేడు నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఫెస్టివల్లో పాల్గొంటారు ఆర్ధిక మంత్రి. తర్వాత విశాఖలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. రేపు నిర్మలా సీతారామన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంను సందర్శించనున్నారు. తాళ్లపాలెంలో రేషన్…
కృష్ణా నది వాటాలో 34శాతానికే కేసీఆర్ సంతకం చేశారు. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా, గోదావరి సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కృష్ణా నదిపైన మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రగతి పద్దుతో దళితుల అభ్యున్నతికి కట్టబడి ఉందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రగతి పద్దును పూర్తిగా వినియోగించలేదు. 1,91,000 వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి…
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. మొదట హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని భావించారు.. కానీ, తాను దత్తతకు తీసుకున్న వాసాలమర్రి నుంచే ఆ పథకం అమలుకు పూనుకున్నారు.. ఇప్పటికే ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.10 చొప్పున ఫండ్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. దళిత బంధుపై విమర్శలు వస్తున్నాయి.. ఆ విమర్శలపై స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దళిత బంధు పథకాన్ని బీజేపీ పార్టీ అడ్డుకునే ప్రయత్నం…
హైదరాబాద్లో అంతర్భాగంగా ఉన్న ఆ ప్రాంతంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నాయి పార్టీలు. ఇదే టైమ్ అనుకున్నాయో ఏమో కరోనా టీకాలతో రాజకీయ ఎత్తుగడలకు తెరతీశాయి. కానీ.. అనుకున్నదొక్కటి…అయ్యిందొక్కటి. పొలిటికల్ వ్యాక్సిన్ వికటించి టెన్షన్ పడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓట్ల కోసం కరోనా టీకా సెంటర్లు ఏర్పాటు! ఎన్నికల సమయంలో వరదలు వస్తే.. బాధితులకు సాయం చేయడానికి పార్టీలు పోటీపడతాయి. ఓట్లు రాబట్టుకోవాలని చూస్తాయి. ఆ సమయంలో జనాలకు ఇంకేదైనా…
విశాఖ:- రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం సాయంత్రం విశాఖకు రానున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక ఈ పర్యటనలో రేపు శ్రీకాకుళం జిల్లా పొందురులో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకల్లో పాల్గొనున్నారు ఆర్ధిక మంత్రి. రేపు సాయంత్రం విశాఖ పెడవాల్తేరులో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా. ఆదివారం కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధులను సందర్శించనున్న నిర్మల సీతారామన్…75ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అల్లూరి ఘాట్ ను సందర్శించనున్నారు. ఇక ఆదివారం సాయంత్రం తాళ్ల…