కోవిడ్ ఎఫెక్ట్: మోడీపాలనపై ప్రభావమెంతో తేలనుంది ?
ఇన్నాళ్లు దేశంలో మోడీకి ఎదురేలేదు. కానీ కరోనా వచ్చాక పరిస్థితులు మారాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ కుదేలైనా.. మోడీ పక్షాన్ని మాత్రం కరోనా చావుదెబ్బ తీసింది. కరోనా టైంలో ప్రజలను ఆదుకునే విషయంలో.. ప్యాకేజీలు ప్రకటించడంలో మోడీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కరోనా ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం.. కవర్ చేయడానికి మోడీ సార్ పెంచిన ధరాఘాతంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఈక్రమంలోనే ఎన్నడూ లేనంతగా మోడీ పాలనపై దేశ ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ ప్రభావం రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
త్వరలోనే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలు మోదీ సర్కారు పనితీరుకు గిటురాయిగా నిలువబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. బీజేపీ సర్కారు వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రధాని అయ్యాక సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక భారత్ అన్నిరంగాల్లో వైఫల్యం చెందినట్లు కన్పిస్తోంది. ఇక కరోనా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చాక మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండటం మోదీకి అగ్ని పరీక్షగా మారబోతుంది.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగబోతున్న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మెజార్టీ పక్షం బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కత్తీ మీద సాములా మారింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మోదీ ప్రభావం ఖచ్చితంగా పడనుంది. దీంతో ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అంత ఈజీ కాదనే వాదనలు విన్పిస్తున్నాయి. వీటికి రాజకీయ విశ్లేషకులు అనేక కారణాలు చెబుతున్నారు.
మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత దాదాపు అన్ని రంగాల్లో విఫలమయ్యారన్నది వాస్తవం. ఇక కరోనా సమయంలో బీజేపీ సర్కారు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిచ్చింది. కరోనా కట్టడిలో.. వైద్య సాయం అందించడంలో..లాక్ డౌన్ లో పేదలకు సాయం ప్రకటించడంలో మోదీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పించిందన్న విమర్శలున్నాయి. దీనికితోడు ప్రభుత్వం కన్నా సామాజిక సంస్థలు, ప్రైవేటు వ్యక్తులే పేదలను లాక్ డౌన్లో ఆదుకున్నాయనే విమర్శలు కేంద్ర సర్కారుపై వచ్చాయి.
దీనికితోడు పెట్రోల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పెట్రోల్, డిజీల్ రేట్లు వందకుపైగా పెరుగగా.. గ్యాస్ ధరలు వెయ్యికి చేరువయ్యాయి. ఈ ప్రభావం నిత్యావసర ధరలపై పడటంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. సామాన్యుడికి ధరాఘాతం మొదలైంది. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష కోట్ల సాయం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. ఇవన్నీ కూడా మోదీ ఇమేజ్ ను దారుణంగా మసకబర్చాయి.
మోదీ తన పాలనలో దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలను గాలికొదిలేశారని విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువ వస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ ప్రభావం ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడే అవకాశం కన్పిస్తోంది. ఇక్కడ గెలుపొటములకు మోదీనే బాధ్యత వహించాల్సి ఉండటంతో ఎన్నికల ఫలితం ఎలా వస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!