వైఎస్ సంస్మరణ సభకు వెళ్లిన బీజేపీ నేతలను పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ సంస్మరణ సభకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీలో చర్చ.. రచ్చ జరుగుతోంది. సభకు హాజరైన బీజేపీ నేతలపై కాషాయ శిబిరంలో ఎలాంటి ఉలుకు.. పలుకు లేదు. కానీ.. సంస్మరణ సభకు వెళ్లినవారి తీరుపై మాత్రం ప్రైవేట్ సంభాషణల్లో గట్టిగానే చర్చ జరుగుతోంది. వాటిపైనే ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
రాజకీయ భవిష్యత్ కోసం కర్చీఫ్ వేశారా?
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
హైదరాబాద్లో వైఎస్ఆర్ సంస్మరణ సభ ముగిసినా.. ఆ కార్యక్రమానికి వెళ్లిన వివిధ పార్టీల నేతలపై చర్చ మాత్రం ఆగడం లేదు. షర్మిల పార్టీ కోసమే సభ పెట్టారన్నది రాజకీయ పక్షాల అనుమానం. అందుకే కాంగ్రెస్ దూరంగా ఉంటే.. బీజేపీ చప్పుడు చేయలేదు. కానీ.. బీజేపీలో ఉంటూ.. కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కూడా సంస్మరణ సభకు వెళ్లారు కొందరు కమలనాథులు. వారిపైనే ఇప్పుడు చర్చ మొదలైంది. రాజకీయ భవిష్యత్ కోసం.. ఆ కొందరు ముందు జాగ్రత్త పడ్డారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ సంస్మరణ సభకు వెళ్లినా బీజేపీ పట్టించుకోలేదు!
బీజేపీ నేతలు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక్రెడ్డి వైఎస్ఆర్ సంస్మరణ సభకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరిగినంత చర్చ బీజేపీలో వీళ్లపై జరగకపోయినా.. ఎందుకు వెళ్లారు అన్నదే ప్రశ్న. దీనిపై వారిని బీజేపీ పెద్దలు అడిగింది లేదు. వివరణ కోరిందీ లేదు. పైగా సభకు అంతగా రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతున్నారు. ఆ మీటింగ్కు వెళ్లిన వారంతా మరుసటి రోజు నుంచే బీజేపీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. శ్రీశైలంగౌడ్.. సంగ్రామయాత్రలో తళుక్కుమంటే.. హుజురాబాద్ ప్రచారంలో కనిపించారు జితేందర్రెడ్డి.
బీజేపీ నేతల్లో కొత్త పోకడలేంటని కాషాయ దళంలో ప్రశ్నలు!
సీఎం కేసీఆర్ దళితుల అంశంపై అఖిలపక్ష మీటింగ్ పెడితే.. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లకూడదని అనుకున్నా.. అప్పటికి బీజేపీలో ఉన్న మోత్కుపల్లి గీత దాటారు. దీనిపై బీజేపీలో చర్చ జరిగింది. ఇంతలో మోత్కుపల్లి బీజేపీని వదిలి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ సంస్మరణ సభపై మాత్రం బీజేపీలో అలాంటి వాతావరణం కనిపించలేదు. రాజకీయ పార్టీ పరంగా షర్మిల పార్టీని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సంస్మరణ సభ షర్మిల పార్టీకి లబ్ధి చేకూర్చడానికి పెట్టిందే అన్నది కమలనాథుల అనుమానం. అయినప్పటికీ ఎక్కడా ఓపెన్ కాలేదు. ఆ సంస్మరణ సభకు బీజేపీ నేతలు వెళ్లినా అభ్యంతరం చెప్పలేదు.. ప్రశ్నించలేదు. దీంతో బీజేపీకి ఏమైంది అని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయట. బీజేపీలో ఈ కొత్త పోకడలేంటని అంతర్గత సంభాషణల్లో నిలదీస్తున్నారట. పార్టీకి ఒక లైన్ అనేది లేకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి పరిణామాలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆందోళన చెందుతున్నారట.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?