అధికార పార్టీలో ఉన్నా.. అనుకోని పరిస్థితుల్లో మరో పార్టీలోకి చేరినా.. తన రూటే సెపరేటు.. అని ఇతరులు అనేలా నడుచుకుంటున్నారు.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. కొంత కాలం క్రితం వరకూ.. గులాబీ జెండా మోసి.. అజెండానూ అమలు చేసిన ఆయన.. అనుకోని పరిస్థితిలో కమలం బాట పట్టారు. కాషాయం గూటికి చేరారు. కానీ.. తన ఒరిజినాలిటీ మాత్రం కోల్పోయేది లేదు.. అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒక్కసారి.. ఈటల టీఆర్ఎస్ నుంచి…
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చేసింది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దళిత, గిరిజన దండోరా పేరుతో పలు జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇదే ఊపులో ఆయన టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రలు లోపించాయని.. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్…
భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు మోడీ శకం నడుస్తోంది. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. మరోవైపు, రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు మోడీ, షా జోడీ వాటిపై ఫోకస్ పెట్టింది. రోగం ముదరకుండా జాగ్రత్త పడుతోంది. ఏకంగా ముఖ్యమంత్రులనే మారుస్తూ ట్రీట్మెంట్ మొదలు పెట్టింది. మోడీ హయాంలో సీఎంల ఎంపిక తాజా రాజకీయ ట్రెండ్కు భిన్నం. ముఖ్యమంత్రి…
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం హాట్ టాపిక్ అయ్యింది.. ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో సవాల్ చేసిన ఆయన నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు.. అయితే, దీనికి అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ వస్తే…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ప్రతిపక్షాలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన పొలిటికల్ కామెంట్లు చేయడం ఏంటి? విమర్శలు చేయడం ఎందుకు? స్పీకర్గా ఉండి ఇలా చేయొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, తనను విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. స్పీకర్ మాట్లాడటమేంటి అంటున్నారు.. ప్రజలు ఓటేసి నన్ను గెలిపించారు.. వారి కోసం మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చెప్పడం కూడా…
సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష…
బీజేపీలో కొన్నేళ్లుగా నరేంద్ర మోదీకి ఎదురులేకుండా పోతోంది. ఆయన ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోంది. మోదీ ఇమేజ్ కారణంగానే బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోని వచ్చిందని ఆపార్టీ నేతలు భావిస్తుంటారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని, ప్రభుత్వంలోగానీ మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు. ఒకవేళ ఎవరైనా మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ల పదవి ఊడటమో.. లేదంటే పార్టీ నుంచి బహిష్కరించడమో చేయడం వంటి సంఘటనలు కన్పిస్తుంటాయి. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక క్యాబినెట్లో…
టీఆర్ఎస్ పార్టీలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. హూజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ మొదలైంది. కాంగ్రెస్ సైతం హుజురాబాద్ వేదికగా తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ ఎన్నిక ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.…
ఈనెల 30 వ తేదీన పశ్చిమ బెంగాల్కు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. భవానీ పూర్ నియోజక వర్గానికి జరిగే ఉప ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలోఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక తిబ్రేవాల్ పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ నందిగ్రామ్ ఓటమి తరువాత మమతా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, బెంగాల్ అసెంబ్లీ…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పొరపాటున బీజేపీ గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు మంత్రి హరీష్రావు.. కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు.. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలిస్తే పది సంవత్సరాలు అభివృద్ధి ముందుకెళ్తుంది.. పొరపాటున బీజేపీ గెలిస్తే 10 సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్తుందన్నారు.. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. హుజురాబాద్…