2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా తమ స్థానాలను భద్రపరుచుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 9 జట్లు డైరెక్ట్ ఎంట్రీని ఖాయం చేసుకున్నాయి.
Vanastalipuram M*urder: రెండు నెలల రెక్కీ.. వనస్థలిపురం హత్య కేసులో సంచలన విషయాలు..!
ఇక మిగిలిన మూడు స్థానాలను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. మార్చి 9వ తేదీని కట్-ఆఫ్ డేట్గా నిర్ణయించగా.. అప్పటిలోపు పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ర్యాంకింగ్స్ ప్రకారమే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ విషయంలో ఇది ఊరట కలిగించే అంశం. 2026 వరల్డ్ కప్లో భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో ఆడేందుకు నిరాకరించినందుకు గానూ ఆ జట్టును ఐసీసీ టోర్నీ నుంచి తప్పించింది.
Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్పై సూర్య ఏమన్నాడంటే?
అయితే, ర్యాంకింగ్స్ పరంగా మెరుగ్గా ఉండటంతో 2028 టోర్నీలో ఆ జట్టు తిరిగి భాగం కానుంది. కాగా గతేడాది భారత్కు వచ్చిన స్కాట్లాండ్ జట్టు ఈసారి మాత్రం రీజినల్ క్వాలిఫైయర్స్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన 8 స్థానాల కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రీజినల్ క్వాలిఫైయర్ రౌండ్లు జరగనున్నాయి. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్లు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి. ఐసీసీ తన అధికారిక ప్రకటనను మార్చి 9న వెలువరించనుంది. ప్రస్తుత వర్ల్స్ కప్ లో సూపర్ 8 ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.