Supreme Court: పంచుకుంటూ పోతే మిగిలేది ఏముండదు.. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆక్షేపణ
- ఉచిత పథకాలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు
- పంచుకుంటూ పోతే మిగిలేది ఏముండదు
- తమిళనాడు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ముందు ఉచిత పథకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచుకుంటూ పోతే అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత పథకాలను ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.
ఇది కూడా చదవండి: IAS Wedding: బ్యాండ్ లేదు.. తంతు లేదు.. సచివాలయంలో దండలతో ఒక్కటైన ఐఏఎస్ జంట
Also Read
- CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
- Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
- BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్లో పేరు మాయం!
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
ఉచిత విద్యుత్ హామీకి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో సమాధానం దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశించగా.. కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకు ఆహారం, ఉచిత్ విద్యుత్ అందిస్తామంటే వాస్తవ పరిస్థితికి నిధులు ఎలా సమకూర్చుతారో చెప్పాలని డిమాండ్ చేసింది. అయినా ఆర్థిక స్థోమత ఉన్నవారికి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పడం ఇదే సంస్కృతి అని ప్రశ్నించింది.
భారతదేశం అంతటా ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాము? అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఉదయం నుంచి ఉచిత ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తే… తర్వాత ఉచిత సైకిల్… తర్వాత ఉచిత విద్యుత్.. ఇప్పుడు మనం నేరుగా ప్రజల ఖాతాలోకి నగదును బదిలీ చేసే దశకు చేరుకుంటున్నాము. ఊహించుకోండి.’’ అని అన్నారు. ‘‘చెల్లించలేని వారికి సంక్షేమ వ్యవస్థలో భాగంగా అందించడం అర్థముంది. కానీ స్థోమత ఉన్నవారు.. చేయలేనివారు అనే తేడా లేకుండా పంపిణీ చేస్తే ఎలా?.’’ అని సీజేఐ నిలదీశారు.
‘‘ప్రతి రాష్ట్ర ఆదాయంలో కనీసం పావు వంతు అభివృద్ధి పనులకు ఉపయోగించాలన్నారు. కొన్నిసార్లు మేము నిజంగా ఆందోళన చెందుతున్నాం. మీరు రెవెన్యూ మిగులు రాష్ట్రమైనప్పటికీ… మొత్తం ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయడం. మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేయడం మీ బాధ్యత కాదా? బదులుగా మీరు ఎన్నికల సమయంలో వస్తువులను పంపిణీ చేస్తూనే ఉంటారు..’’ అని తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి విధానాల వల్ల అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలడం లేదు. ఇది మీది మాత్రమే కాదు. అన్ని రాష్ట్రాల సమస్య.’’ అని తమిళనాడు ప్రభుత్వానికి ధర్మాసనం తెలిపింది.
జస్టిస్ జోయ్మల్య బాగ్చి మాట్లాడుతూ.. ఉచిత పథకాలు పంపిణీ చేయాలనుకునే రాష్ట్రాలు ‘‘మీ బడ్జెట్ కేటాయింపులలో పొందిపరచండి. మీరు అలా ఎలా చేస్తారో తెలియజేయండి.’’ అని సూచించారు.
గత ఏడాది నవంబర్లో ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్రలోని ‘లడ్కీ బహిన్’ పథకాన్ని ప్రస్తావించారు. 21 నుంచి 65 ఏళ్ల మధ్య వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున ఇస్తున్నారు. ‘‘ఎన్నికల ముందు ప్రకటించిన ఉచితాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు.’’ అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!