ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది… మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.. ఇక, రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాల్ విసిరారు.. తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… దమ్ముంటే రేవంత్రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎన్నికలకు వెళ్దామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మంత్రి మల్లారెడ్డి సవాల్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై…
అధికార టీఆర్ఎస్ పార్టీ పై బీజేపీ నేత విజయశాంతి మరో సారి మండి పడ్డారు. ”పీసీసీ అధ్యక్షులు, టీఆరెస్ మంత్రిగారికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళ గురించి మల్కాజిగిరి పార్లమెంట్తో పాటు మేడ్చల్ అసెంబ్లీ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడిన భాష, పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే…. ఆ రాజీనామాలు జరిగి ఉపఎన్నికలు వస్తే తమకు ఈ టీఆరెస్ ముఖ్యమంత్రి ఏదో వరాలు అవసరార్థం తప్పనిసరై ఇవ్వచ్చేమో అనే…
కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర ఏపీ బీజేపీ నేతలకు ఊపు తెచ్చిందా? లేక ఆ ఒక్క విజిట్తో అంతా తారుమారైందా? ఇంతకీ ఆ భేటీ ముందుగానే ప్లాన్ చేశారా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కేంద్ర పథకాలకు రాష్ట్రాలు స్టిక్కర్లు వేస్తున్నాయని కిషన్రెడ్డి విమర్శ! కేంద్ర కేబినెట్లో పదోన్నతులు పొందిన మంత్రులు.. ఆయా రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్రలు మొదలుపెట్టారు. ఆ విధంగా ఏపీకి వచ్చారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. తిరుపతి,…
తమిళనాడు బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ కలకలం రేపుతున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ పార్టీ సభ్యురాలితో అసభ్యకరంగా వీడియో కాల్ చాటింగ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యంగా విడీయో కాల్ మాట్లాడిని రాఘవన్పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు…
ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టే తిరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ విషయంలో పెద్ద సస్పెన్స్ ఏమీ లేదు ..కానీ కాంగ్రెస్లోనే ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి ఎవరని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే, కొండా సురేఖ పేరు ఖరారు అయిందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందటమే ఆలస్యమట. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ మూడు పేర్లతో హైకమాండ్కు నివేదిక…
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను దగాచేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ,24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్టు ను అందించడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు,…
దేశంలో యాభై శాతం కూడా వృద్ధి లేదని… బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకెళుతోందని..అభివృద్ధిపై కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. వారిది అవగాహన రహిత్యమా ? రాజకీయ లబ్ది కోసమా ? కేంద్రం ఇచ్చిన గణాంకాలే చెప్తున్నా ఇలా మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణ రెట్టింపు వృద్ధి రేటు సాధించిందని… తలసరి…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. రేపు ప్రారంభం కావాల్సిన యాత్ర కల్యాణ్ సింగ్ మరణంతో.. 28 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఓ వైపు కిషన్ రెడ్డి జనాశీర్వాద యాత్రతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు చుట్టేశారు. సంజయ్ పాదయాత్ర మాత్రం ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. కొన్నాళ్లు జోరుగా కనిపించిన బండి సంజయ్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. పదే…
అమ్మ అడగదు… అడుక్కోనివ్వదు. ఆ పార్టీ నేతల తీరు కూడా అలాగే ఉందట. ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై వాళ్లు అడగలేరు. పైగా అడిగేవాళ్లకు అడ్డుపడుతున్నారట. ఈ అంశంపైనే ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. వారెవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీకి ఇచ్చిన హామీలపై బీజేపీ నేతలు అడగలేరు? విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు అనేక హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెవెన్యూ లోటు భర్తీ దగ్గర నుంచి.. కీలక సంస్థల ఏర్పాటు.. పోలవరం నిర్మాణం.. ప్రత్యేక హోదా..…
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని.. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక కనిపించదని… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ ఆర్ ఎస్ లో చేరారని చురకలు అంటించారు.తనకు మొదటి నుంచి ఒక చెడ్డ లక్షణం ఉంది.. గొంతులో నుంచి మాట్లాడను.. మనసులో నుంచీ మాట్లాడతాననని తెలిపారు. తెలంగాణ రాజకీయ నాయకులు ఏ.ఎస్.ఐ అధ్వర్యంలో కట్టడాలను గుర్తించడం లో వైఫల్యం చెందారని.. మతంతో కట్టడాలకి సంబధం లేదని తెలిపారు.…