బీజేపీలో లుకలుకలు.. మోదీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీలో కొన్నేళ్లుగా నరేంద్ర మోదీకి ఎదురులేకుండా పోతోంది. ఆయన ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోంది. మోదీ ఇమేజ్ కారణంగానే బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోని వచ్చిందని ఆపార్టీ నేతలు భావిస్తుంటారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని, ప్రభుత్వంలోగానీ మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు. ఒకవేళ ఎవరైనా మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ల పదవి ఊడటమో.. లేదంటే పార్టీ నుంచి బహిష్కరించడమో చేయడం వంటి సంఘటనలు కన్పిస్తుంటాయి.
నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక క్యాబినెట్లో మంత్రులంతా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఒకరిద్దరు మంత్రులు మినహా మిగతా వారంతా ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్న దాఖలాల్లేవు. వీరందరికీ మోదీ భజన తప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్టవు. అంతా మోదీని చూసుకుంటారని భావిస్తుంటారు. ఇక బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్లు కన్పిస్తుంది.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
బీజేపీ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినట్లుగానే.. మోదీ మంత్రివర్గంలోని వారిలోనూ కొంత వ్యతిరేకత వచ్చినట్లు కన్పిస్తుంది. ఈక్రమంలోనే బీజేపీ నేతలు కొందరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఆమధ్య మోదీ విధానాలను వ్యతిరేకిస్తూ సినీనటుడు, బీజేపీ నేత శతృజ్ఞ సిన్హా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై మోదీ సీరియస్ కావడంతో ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత యశ్వంత్ సిన్హాతోపాటు మరికొందరు మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడి పార్టీకి దూరం కావాల్సి వచ్చింది.
తాజాగా ఇప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ వంతు వచ్చినట్లు కన్పిస్తోంది. ఇటీవల బీజేపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలపై ఆయన వ్యాఖలు చేశారు. పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు ఎవరూ కూడా సంతోషంగా లేరని జైపూర్లో జరిగిన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల సీఎంలను మారుస్తున్న క్రమంలోనే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గడ్కరీ డైరెక్ట్ గా మోదీని ఉద్దేశించి ప్రస్తావించకపోయినా సూటిగా మోదీకే తాకేలా ఆ మాటలున్నాయి. దీంతో బీజేపీలో లుకలుకలు మొదలైనట్లు కన్పిస్తున్నాయి.
గత ఆరునెలల కాలంలో బీజేపీ ఏకంగా ఆరుగురు సీఎంలను మార్చింది. మరోవైపు కొందరు మంత్రులు తమకు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వలేదని మండిపడుతున్నారు. దీనికితోడు చెప్పాపెట్టకుండా సీఎంలను మారుస్తుండటంతో తమ పదవి ఎక్కడ పోతుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో మెల్లిమెల్లిగా బీజేపీ నేతలు తమ అసంతృప్తిని మోదీపై వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే గడ్కరీ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేయగా ఆయన బాటలో మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటలన్నీ చూస్తుంటే ఇంటా బయట మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నట్లు కన్పిస్తోంది. దీంతో మోదీ ఈ విషయంలో అధిష్టానం పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతారనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!