మా లక్ష్యం ఒక్కటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్రావు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. 70 ఏళ్ల వయస్సులో గాజువాక ఎమ్మెల్యే కూడా నిర్వాసితుల కోసం పాదయాత్ర చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికి 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఆయన.. అయితే, ఢిల్లీలో…
త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ తమ సీఎం అభ్యర్థులను సైతం మార్చివేసి తగ్గేదేలే అని చాటిచెబుతోంది. ఇదే ఫార్మూలాను తాజాగా కాంగ్రెస్ సైతం అవలంభిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పంజాబ్, ఉత్తరాఖండ్,…
ఆరు సార్లు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా గెలిపించారు.. ఇప్పుడు రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆర్థిక మంత్రి హరీష్రావు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్రావు మాట్లాడుతూ.. మోత్కులగూడెం 90శాతం టీఆర్ఎస్ వైపు వచ్చిందన్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు.. 18 ఏళ్లలో మీకు ఈటల చేయని పని, మీ…
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరోసారి మారుతాయనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.…
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత తృణమూల్ నుంచి వచ్చిన కొంతమంది నేతలు తిరిగి ఆ పార్టీలో చేరిపోయారు. తాజాగా మాజీకేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా తృణమూల్లో చేరడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ను తప్పించి ఆ స్థానంలో ఎంపీ సుకంత మజుందర్ను నియమించింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ నుంచి పక్కకు తప్పుకున్న దిలీప్ ఘోష్కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా…
త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్, సిందగీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపి తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక జరగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఎలాగైనా సరే గెలిచి పట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్, డీవీ సదానంద గౌడ, నళిన్ కుమార్ కటిల్ లతో నాలుగు బృందాలను…
పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే, భవానీ పూర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. కొన్నినెలల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సిట్టింగ్ స్థానం భవానీ పూర్…
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మరోసారి టీఎంసీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. వరుసగా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్బై చెప్పి.. మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.. దీంతో.. నష్టనివారణ చర్యలు చేపట్టింది బీజేపీ అధిష్టానం.. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్గా ఉన్న దిలీప్ ఘోష్పై వేటు వేసింది.. ఆయన స్థానంలో ఎంపీ సుకంత మజుందర్ను నియమించింది. కాగా, బెంగాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని…
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా?…
తెలంగాణలో ఇప్పుడు వైట్ ఛాలెంట్ హాట్ టాపిక్గా మారిపోయింది.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి సవాల్ విసిరితే.. ఆ సవాల్ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లకు వైట్ ఛాలెంజ్ విసిరారు.. అయితే, మాజీ ఎంపీ కొండా ఛాలెంజ్ను స్వీకరిస్తూనే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బాగా బలిసినోడు,…