Bangladesh: యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..
- మహ్మద్ యూనస్ ఎగ్జిట్..
- భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ ఆరాటం..
- సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్న కొత్త మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ సర్కార్ తన రాజకీయ స్వలాభం కోసం భారత్ను బూచిగా చూపించే విధంగా గేమ్ ఆడారు. బంగ్లా ప్లేయర్లు భారత్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. భారత్తో భద్రతా సమస్యలు ఉన్నాయని తమ టీం అక్కడ ఆడదంటూ వితండవాదం చేశారు. చివరకు ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి నిషేధించింది.
Read Also: Mumbai Court: మైనర్ బాలికకు “ఫ్లయింగ్ కిస్” ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..
Also Read
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తారిక్ రెహ్మాన్ నేతృత్వంలో బీఎన్పీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. మహ్మద్ యూనస్ అధికారం పోయింది. దీంతో, ఇప్పుడు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. క్రికెట్ సంబంధాలను మళ్లీ నెలకొల్పాలని బంగ్లా కొత్త క్రీడా మంత్రి అమీనుల్ హక్ భావిస్తున్నారు. భారత డిప్యూటీ హైకమిషనర్తో చర్చలు జరిపినట్లు హక్ చెప్పారు. ‘‘స్నేహపూర్వకం చర్చల’’ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన బంగ్లాదేశ్ బోర్డును కూడా హక్ విమర్శించారు. పొరుగుదేశాలో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవాలని ఆయన అన్నారు. దౌత్యపరమైన సమస్య కారణంగా బంగ్లా టీం టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోయిందని, ఒక వేళ చర్చించి పరిష్కరించుకుంటే ఇప్పుడు తమ టీం టోర్నీలో ఆడుతూ ఉండేదని ఆయన అన్నారు.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ మద్దతుదారులుగా ఉన్న క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, మష్రఫే మోర్తాజాపై ఉన్న కేసులను పరిష్కరించడం ద్వారా జాతీయ జట్టులోకి వస్తారని హక్ అన్నారు. గతంలో ఈ ఇద్దరు అవామీ లీగ్ ఎంపీలుగా పనిచేశారు. యూనస్ అధికారం చేపట్టిన తర్వాత విదేశాల్లో ఉంటున్న షకీబ్ బంగ్లాకు తిరిగిరాలేదు. ఇక మోర్తజా బహిరంగంగా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!