Bangladesh: యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..
- మహ్మద్ యూనస్ ఎగ్జిట్..
- భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ ఆరాటం..
- సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్న కొత్త మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ సర్కార్ తన రాజకీయ స్వలాభం కోసం భారత్ను బూచిగా చూపించే విధంగా గేమ్ ఆడారు. బంగ్లా ప్లేయర్లు భారత్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. భారత్తో భద్రతా సమస్యలు ఉన్నాయని తమ టీం అక్కడ ఆడదంటూ వితండవాదం చేశారు. చివరకు ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి నిషేధించింది.
Read Also: Mumbai Court: మైనర్ బాలికకు “ఫ్లయింగ్ కిస్” ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..
Also Read
- IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తారిక్ రెహ్మాన్ నేతృత్వంలో బీఎన్పీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. మహ్మద్ యూనస్ అధికారం పోయింది. దీంతో, ఇప్పుడు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. క్రికెట్ సంబంధాలను మళ్లీ నెలకొల్పాలని బంగ్లా కొత్త క్రీడా మంత్రి అమీనుల్ హక్ భావిస్తున్నారు. భారత డిప్యూటీ హైకమిషనర్తో చర్చలు జరిపినట్లు హక్ చెప్పారు. ‘‘స్నేహపూర్వకం చర్చల’’ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన బంగ్లాదేశ్ బోర్డును కూడా హక్ విమర్శించారు. పొరుగుదేశాలో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవాలని ఆయన అన్నారు. దౌత్యపరమైన సమస్య కారణంగా బంగ్లా టీం టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోయిందని, ఒక వేళ చర్చించి పరిష్కరించుకుంటే ఇప్పుడు తమ టీం టోర్నీలో ఆడుతూ ఉండేదని ఆయన అన్నారు.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ మద్దతుదారులుగా ఉన్న క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, మష్రఫే మోర్తాజాపై ఉన్న కేసులను పరిష్కరించడం ద్వారా జాతీయ జట్టులోకి వస్తారని హక్ అన్నారు. గతంలో ఈ ఇద్దరు అవామీ లీగ్ ఎంపీలుగా పనిచేశారు. యూనస్ అధికారం చేపట్టిన తర్వాత విదేశాల్లో ఉంటున్న షకీబ్ బంగ్లాకు తిరిగిరాలేదు. ఇక మోర్తజా బహిరంగంగా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..