కాంగ్రెస్ వ్యూహం వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ తమ సీఎం అభ్యర్థులను సైతం మార్చివేసి తగ్గేదేలే అని చాటిచెబుతోంది. ఇదే ఫార్మూలాను తాజాగా కాంగ్రెస్ సైతం అవలంభిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో మార్చి నాటికి అసెంబ్లీ గడువు ముగియనుంది. ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రం మేలో చివరినాటికి ముగియనుంది. ఈ ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంగా ఉండగా కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో అధికారంలోకి ఉంది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ పంజాబ్ లో అధికారాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యతక నెలకొంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ లో ఇటీవల ముఖ్యమంత్రిని మార్చడం వెనుక పెద్దవ్యూహామే ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ ను సింగ్ ను అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జీత్ సింగ్ చన్నీకి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది. పంజాబ్ రాష్ట్రం తమ చేతుల నుంచి జారిపోకుండా ఉండాలనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థులకు షాకిచ్చినట్లే కన్పిస్తుంది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని మార్చడం తప్పా? ఒప్పా అన్న సంగతి పక్కకు పెడితే దీని వెనుక పెద్ద వ్యూహామే ఉన్నట్లు అర్థమవుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన తొలి దళిత నేత చన్నీయే. అంటే ఇప్పటివరకు అగ్రవర్ణ నేతలే సీఎంలుగా ఉన్నారని స్పష్టమవుతోంది. పంజాబ్ లో దళిత ఓటర్లు 32శాతం ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆపార్టీని అధికారంలోకి రావడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలైన శిరోమణి అకాలీదల్, బీజేపీ పార్టీలు సీఎం అభ్యర్థులుగా ఎస్సీలేనని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైతం అలర్ట్ అయింది.
ఈక్రమంలోనే ఆపార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ ఎస్సీ నేతకే పట్టం కట్టింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దళితుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న చరణ్ జిత్ చన్నీకి సీఎంగా అవకాశం కల్పించింది. రాబోయే ఎన్నికల్లో దళిత ఓటును బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుగానే పావులు కదిపినట్లు తెలుస్తోంది. తాము చేయాలనుకున్న పనిని ముందుగానే కాంగ్రెస్ పార్టీ చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు షాక్ కొట్టినట్లయింది. మొత్తానికి వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ చరణ్ జిత్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లనుంది. దీంతో కాంగ్రెస్ దళిత వ్యూహాం ఆపార్టీకి కలిసి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!