నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఇవ్వాళ్టితో ఉప ఎన్నిక ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోసం ఆపార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు లో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక్కడ రోడ్లు గుంతలు చూడలేక మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారు. మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో తిరుగుతున్నారు.…
వైసీపీ మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందన్నారు ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విషువర్ధన్ రెడ్డి. నడ్డా పర్యటన తరువాత వైసీపీ నిజ స్వరూపం బయట పడింది. ఏపీలో ఇసుక, భూ, మధ్యం, మైనింగ్ మాఫియా జరుగుతుందన్న నడ్డా ఆరోపణలు నిజం కాదా? దేశంలోనే మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. మూడేళ్లలో ఏపీ అభివృద్ధి చెందలేదు… వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయింది. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకొని లబ్ధిదారులకు…
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. మాజీ మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైరయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు. మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు…
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టారు. కుల ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతున్నారు. భారత దేశం కులవ్యవస్థతో ఏర్పాటైన సమాజం. స్వాతంత్రోద్యమం గుణ పరంగా జరిగింది కానీ.. ఎన్నికలనేవి కులపరంగానే జరుగుతున్నాయి. జనసేన కులాల ఐక్యత కోరుకునే పార్టీ. కుల విభజనతో రాజకీయాలు చేయకూడదన్నారు పవన్. రాజకీయాలను కొన్ని కులాలకే పరిమితం చేయకూడదు. కోనసీమలో వైసీపీ విచ్ఛిన్నకర రాజకీయం…
ఏపీలో తరచూ వినిపిస్తున్న పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వన్ సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక.. మిగిలిన విషయాలు మాట్లాడతాం.రాష్ట్రం కోసం నేను తగ్గడానికి సిద్దం. అన్నిసార్లు తగ్గాను.. ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాను. టీడీపీ కొంత తగ్గితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ సూచించారు. బీజేపీతో సంబంధాలు బాగున్నాయంటూ పవన్ స్పష్టీకరించారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లపై చర్చిద్దామని…
ఏపీలో బీజేపీ-వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకి స్పీకర్ అతనిని సస్పెండ్ చేయాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దీనిపై గవర్నర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాం అన్నారు. పోలవరం,ఉత్తరాంధ్ర జిలాల్లో ప్రాజెక్టులు కడుతున్నాము. బీజేపీకి మాత్రమే వైసీపీ ప్రభుత్వం భయపడుతుంది. జెఎన్టీయుకె ఆస్థులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసులు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణి అనుచరుడు…
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
రేషనుకు నగదు బదిలీపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. 2017లో కేంద్రం తెచ్చిన పథకాన్నే ఏపీలో అమలుచేస్తున్నాం. సోము వీర్రాజు పథకం గురించి ప్రధాని మోడీని అడగాలి. రేషన్ బియ్యానికి నగదు చెల్లింపుల పథకాన్ని విమర్శించడమంటే మోడీని విమర్శించినట్లే అన్నారు. రేషన్ బియ్యానికి నగదు బదిలీపై ఎలాంటి ఒత్తిడి లేదు. బలవంతంగా ఎవరి మీదా నగదు బదిలీ అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై కావాలనే సోము వీర్రాజు ఆరోపణలు…
కేబినెట్లో చోటు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి ఎక్కడ తేడా కొట్టింది? ఆయనకు ప్రతికూలంగా మారిన పరిణామాలేంటి? శిల్పా అనుచరుల్లో ఏ అంశంపై చర్చ జరుగుతోంది? పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తున్న వాదనేంటి? మంత్రి పదవి రాకుండా ఎక్కడ తేడా కొట్టింది? నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని చివరి వరకు ప్రచారం జరిగింది. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం.. అధికారంలో ఉన్న టీడీపీ నుంచి ఆరేళ్ల ఎమ్మెల్సీ…
ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అధికార పార్టీని అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయం పార్టీని కుదిపేస్తోంది. అంతా బాగానే వుందని చెబుతున్నా.. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు నేతలు. నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబ్బలు…