Pawan Kalyan: వైసీపీది విచ్ఛిన్నకర రాజకీయం
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టారు. కుల ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతున్నారు. భారత దేశం కులవ్యవస్థతో ఏర్పాటైన సమాజం. స్వాతంత్రోద్యమం గుణ పరంగా జరిగింది కానీ.. ఎన్నికలనేవి కులపరంగానే జరుగుతున్నాయి. జనసేన కులాల ఐక్యత కోరుకునే పార్టీ. కుల విభజనతో రాజకీయాలు చేయకూడదన్నారు పవన్.
రాజకీయాలను కొన్ని కులాలకే పరిమితం చేయకూడదు. కోనసీమలో వైసీపీ విచ్ఛిన్నకర రాజకీయం చేసింది. బహుజన సిద్దాంతంపై వైసీపీ దాడి చేస్తోంది. తెలంగాణలో కులభావన లేదు.. రాష్ట్ర భావన ఉంది.. కానీ ఏపీలో కుల భావనే ఉంది తప్ప.. ఏపీ అనే భావన కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలున్న వ్యక్తి ఏసీబీని కంట్రోల్ చేస్తారట.. చాలా హస్యాస్పదంగా ఉంది.
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
వాళ్ల నాన్న సీఎంగా ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకున్నారు.. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.కాపులను..శెట్టిబలిజలనే తప్పు చేసిన వాళ్లుగా చూస్తున్నారు. శెట్టి బలిజలను దారుణంగా విమర్శిస్తున్నారు. ఇవన్నీ వైసీపీ కావాలనే చేస్తోంది.వైసీపీలోని రెండు వర్గాల మధ్య గొడవే.. కొనసీమలో చిచ్చుకు కారణం.క్రిమినల్ ఎలిమెంట్స్ లేకుండా మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగులబడుతుందా..?జనసేనను ఎలా తప్పు పడతారు..?వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టినందుకు నిరసన తెలుపుతామంటే 144 సెక్షన్ పెట్టారే.. ఇంత పెద్ద గొడవకు జాగ్రత్త పడరా..?
కోనసీమ ఎపిసోడ్ వల్ల జనసేనకు ఏదో నష్టం జరుగుతుందని వైసీపీ భావిస్తే.. అది తెలివి తక్కువ తనమే అవుతుంది.నేను కులాలను కలిపే వాడినే కానీ.. విభజన చేసే వాడిని కాను.యువజనులకు ఉద్యోగాల్లేవ్, కార్మికులకు ఉపాధి లేదు.. రైతులకు గిట్టుబాటు లేదు.. ఇదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ అంటే నాకు గౌరవం. వైసీపీ కొన్ని కులాలను వర్గ శత్రువుగా ప్రకటించుకుంటోంది.
గతంలో కమ్మవాళ్లని వర్గ శత్రువుగా ప్రకటించినప్పుడే నేను తప్పు పట్టాను. ఓటేయని ప్రతి కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించే సంస్కృతిని తెచ్చింది వైసీపీ. ఇప్పుడు కమ్మొళ్లనే కాకుండా శెట్టిబలిజలు సహా కాపు, వైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలను వైసీపీ తన వర్గ శత్రువులుగా ప్రకటించింది. కమ్మొళ్లని తిట్టాల్సిందంతా తిట్టేసి ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే చాలా..? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ మరిచిపోతే మంచిది.
అర్ధం కాకుండా మాట్లాడ్డం బొత్సకు అలవాటు. ఎన్ని విమర్శలు చేసినా చేసుకోండి.. కానీ ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లేలా ప్రస్తావన తేవద్దు. అంబేద్కర్ పేరు మాకు ఆమోదయోగ్యమే కానీ.. ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లింప చేయడం మాత్రం ఆమోదం కాదు. అంబేద్కర్ పేరు మాకు ఆమోదమే.. కానీ ఏకాభిప్రాయానికి రావాల్సింది కోనసీమ ప్రజలే.
ఏకాభిప్రాయానికి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శాంతి కమిటీలు వేసుకోవాలి.. దీనికి జనసేన చొరవ తీసుకోవాలి. జనసేన-బీజేపీకి మంచి సంబంధాలే ఉన్నాయి.కానీ కరోనా కారణంగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టలేకపోయాం. త్వరలోనే జనసేన-బీజేపీ మధ్య సోషల్ డిస్టెన్స్ తగ్గుతుంది.ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ స్థాయి నేతలతో చర్చలు కూడా జరిపామన్నారు పవన్.
తాజావార్తలు
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో