Pawan Kalyan: వైసీపీది విచ్ఛిన్నకర రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టారు. కుల ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతున్నారు. భారత దేశం కులవ్యవస్థతో ఏర్పాటైన సమాజం. స్వాతంత్రోద్యమం గుణ పరంగా జరిగింది కానీ.. ఎన్నికలనేవి కులపరంగానే జరుగుతున్నాయి. జనసేన కులాల ఐక్యత కోరుకునే పార్టీ. కుల విభజనతో రాజకీయాలు చేయకూడదన్నారు పవన్.
రాజకీయాలను కొన్ని కులాలకే పరిమితం చేయకూడదు. కోనసీమలో వైసీపీ విచ్ఛిన్నకర రాజకీయం చేసింది. బహుజన సిద్దాంతంపై వైసీపీ దాడి చేస్తోంది. తెలంగాణలో కులభావన లేదు.. రాష్ట్ర భావన ఉంది.. కానీ ఏపీలో కుల భావనే ఉంది తప్ప.. ఏపీ అనే భావన కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలున్న వ్యక్తి ఏసీబీని కంట్రోల్ చేస్తారట.. చాలా హస్యాస్పదంగా ఉంది.
Also Read
వాళ్ల నాన్న సీఎంగా ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకున్నారు.. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.కాపులను..శెట్టిబలిజలనే తప్పు చేసిన వాళ్లుగా చూస్తున్నారు. శెట్టి బలిజలను దారుణంగా విమర్శిస్తున్నారు. ఇవన్నీ వైసీపీ కావాలనే చేస్తోంది.వైసీపీలోని రెండు వర్గాల మధ్య గొడవే.. కొనసీమలో చిచ్చుకు కారణం.క్రిమినల్ ఎలిమెంట్స్ లేకుండా మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగులబడుతుందా..?జనసేనను ఎలా తప్పు పడతారు..?వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టినందుకు నిరసన తెలుపుతామంటే 144 సెక్షన్ పెట్టారే.. ఇంత పెద్ద గొడవకు జాగ్రత్త పడరా..?
కోనసీమ ఎపిసోడ్ వల్ల జనసేనకు ఏదో నష్టం జరుగుతుందని వైసీపీ భావిస్తే.. అది తెలివి తక్కువ తనమే అవుతుంది.నేను కులాలను కలిపే వాడినే కానీ.. విభజన చేసే వాడిని కాను.యువజనులకు ఉద్యోగాల్లేవ్, కార్మికులకు ఉపాధి లేదు.. రైతులకు గిట్టుబాటు లేదు.. ఇదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ అంటే నాకు గౌరవం. వైసీపీ కొన్ని కులాలను వర్గ శత్రువుగా ప్రకటించుకుంటోంది.
గతంలో కమ్మవాళ్లని వర్గ శత్రువుగా ప్రకటించినప్పుడే నేను తప్పు పట్టాను. ఓటేయని ప్రతి కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించే సంస్కృతిని తెచ్చింది వైసీపీ. ఇప్పుడు కమ్మొళ్లనే కాకుండా శెట్టిబలిజలు సహా కాపు, వైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలను వైసీపీ తన వర్గ శత్రువులుగా ప్రకటించింది. కమ్మొళ్లని తిట్టాల్సిందంతా తిట్టేసి ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే చాలా..? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ మరిచిపోతే మంచిది.
అర్ధం కాకుండా మాట్లాడ్డం బొత్సకు అలవాటు. ఎన్ని విమర్శలు చేసినా చేసుకోండి.. కానీ ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లేలా ప్రస్తావన తేవద్దు. అంబేద్కర్ పేరు మాకు ఆమోదయోగ్యమే కానీ.. ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లింప చేయడం మాత్రం ఆమోదం కాదు. అంబేద్కర్ పేరు మాకు ఆమోదమే.. కానీ ఏకాభిప్రాయానికి రావాల్సింది కోనసీమ ప్రజలే.
ఏకాభిప్రాయానికి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శాంతి కమిటీలు వేసుకోవాలి.. దీనికి జనసేన చొరవ తీసుకోవాలి. జనసేన-బీజేపీకి మంచి సంబంధాలే ఉన్నాయి.కానీ కరోనా కారణంగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టలేకపోయాం. త్వరలోనే జనసేన-బీజేపీ మధ్య సోషల్ డిస్టెన్స్ తగ్గుతుంది.ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ స్థాయి నేతలతో చర్చలు కూడా జరిపామన్నారు పవన్.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!