Perni Nani Vs GVL: ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబడ్దార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. మాజీ మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైరయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు.
మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు పడుతుందా..? అనే భయంలో ప్రజలు ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబడ్దార్ అంటూ ఎంపీ జీవీఎల్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు మాట్లాడే ప్రతి చెత్త కామెంటును మా పార్టీ హైకమాండుకు తర్జుమా చేసి పంపుతాం. కేంద్ర నిధులను మళ్లిస్తోంది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
కాగ్ తప్పు పట్టిన విధంగా రూ. 12 వేల కోట్లు ఏమయ్యాయి..? అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. మీకు మీరు డబ్బా కొట్టుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్య శ్రీగా మార్చ లేదా..? కేంద్ర పధకాలకు మీ స్టిక్కర్లు వేసుకుంది వాస్తవం కాదా..? కాగ్ నివేదిక చూపిస్తే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు..? వీటి సమాధానం చెప్పే దమ్ము మీకుందా? అన్నారు జీవీఎల్.
కేంద్రం ఎంత సాయం చేసింది.. మీరు దేనికి ఎంత వాడారు..? ఆర్ధిక మంత్రి బయటకు వచ్చి చర్చిస్తారా..? ఆర్ధిక మంత్రి ఢిల్లీలో పర్యటిస్తోంది అప్పుల కోసం కాదా..? కొత్తగా తీసుకున్న అప్పుల నుంచి పాత అప్పులు చెల్లిస్తోంది నిజం కాదా..? లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల ఏపీగా మార్చారు. వైసీపీ నేతలు మాట్లాడే మాట్లాడే ప్రతి చెత్త మాట మా పెద్దలకు తర్జుమా చేసి మరీ చెబుతాం.
లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియాగా కోట్లు దోచుకుంటున్నారు. డిజిటల్ ఇండియా అంటుంటే.. ఏపీలో లిక్కర్, ఇసుకకు నేరుగా నగదు ఎందుకు తీసుకుంటున్నారు..? స్థాయి తెలుసుకోకుండా, పిచ్చిగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పదవులు పోయాయనే ప్రస్టేషనుతో మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు.
ఇంకోసారి రాజకీయ విమర్శలు కాకుండా రంకెలేస్తే తగిన బుద్ధి చెబుతాం. ఏపీలో ఎక్కడికి వెళ్లాలన్నా మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. జొన్నాడ వెళితే సోము వీర్రాజుని అడ్డుకున్నారు. ఏపీ ఏమైనా నిషేధిత ప్రాంతమా..?అమలాపురం అల్లర్లను వైసీపీ వాళ్లే చేశారని స్వయంగా మంత్రే చెప్పారు. కేంద్రం సాయం, ఖర్చులు, పధకాల అంశాలపై బహిరంగ చర్చకు సిద్దం.చర్చకు రావాలంటే రండి.. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం అన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!