బీహార్ రాజకీయ సంక్షోభం చివరంఖానికి చేరుకుంది. అంతా ఊహించినట్టుగానే మహాకూటమికి నితీష్కుమార్ గుడ్బై చెప్పేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఓ వైపు బీహార్ సంక్షోభం కాకరేపుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటన ఇండియా కూటమిలో మరో గందరగోళం సృష్టించేటట్లుగానే కనిపిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అఖిలేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది.
Land for jobs scam: బీహార్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూతో పాటు ఆయన కుమార్తె హేమా యాదవ్ని ఫిబ్రవరి 9న తమ ముందు హాజరుకావాలని శనివారం ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’లో వీరందరికి సమస్లు వచ్చాయి.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చాపకింద నీరులా చకచక మార్పులు, చేర్పులు జరిగిపోతుంటాయి. ఇందుకు బీహార్లో చోటుచేసుకున్న పరిణామాలే ఉదాహరణ. నిన్నటిదాకా నితీష్కుమార్ నాయకత్వంలో సాఫీగా సాగిపోతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది.
బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఇవాళ నితీశ్ కుమార్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. దాంతో ఇప్పటి వరకూ ఉన్న ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.
బిహార్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో నితీశ్కుమార్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో బంధం విచ్ఛిన్నమైంది. ఇరు పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. దీంతో మరోసారి నితీష్ కుమార్ తన పాత స్నేహితుడైన బీజేపీ సాయంతో అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే లాలూ కూడా అధికారం కోసం పావులు కుదుపుతున్నారు.
Bihar: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వమైన మహాఘటబంధన్కి తెరపడింది. మరోసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, తన పాత మిత్రుడు బీజేపీతో కలిసి అధికారం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు జనవరి 28న జేడీయూ-బీజేపీల ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఈ వారం అంతా చెలరేగిన ఊహాగానాలను ధృవీకరిస్తూ శుక్రవారం జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్ష పదవికి లాలన్ సింగ్ రాజీనామా చేశారు. 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు.