Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో బంధం విచ్ఛిన్నమైంది. ఇరు పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. దీంతో మరోసారి నితీష్ కుమార్ తన పాత స్నేహితుడైన బీజేపీ సాయంతో అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే లాలూ కూడా అధికారం కోసం పావులు కుదుపుతున్నారు.
Bihar: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వమైన మహాఘటబంధన్కి తెరపడింది. మరోసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, తన పాత మిత్రుడు బీజేపీతో కలిసి అధికారం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు జనవరి 28న జేడీయూ-బీజేపీల ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఈ వారం అంతా చెలరేగిన ఊహాగానాలను ధృవీకరిస్తూ శుక్రవారం జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్ష పదవికి లాలన్ సింగ్ రాజీనామా చేశారు. 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు.
Lalan Singh : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ రాజీనామాపై జోరుగా చర్చ సాగుతోంది. లాలన్ సింగ్ తన రాజీనామాను సిఎం నితీష్కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
Nitish Kumar: అసెంబ్లీలో సెక్స్ ఎడ్యుకేషన్పై చేసిన ప్రసంగానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పశ్చాత్తాప్పడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడుతూ.. నేను మహిళా విద్య గురించి మాట్లాడాను.
బీహార్లో ముస్లిం సమాజంలో కోల్పోయిన తన మద్దతును తిరిగి తీసుకురావడానికి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆయన తన నివాసంలో జేడీయూతో సంబంధం ఉన్న ముస్లిం నేతలతో సమావేశమయ్యారు.
Pappu Yadav: ఇటీవల ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసిన సమయంలో మటన్ తో విందు చేసిన నేపథ్యంలో వారిపై బీజేపీ నేత సుశీల్ మోడీ విమర్శలు గుప్పించారు. పవిత్రమైన శ్రావన్ మాసంలో మటన్ లో విందు ఏంటని..? ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పూ యాదవ్ మంగళవారం విరుచుకుపడ్డారు. సుశీల్ మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
ఆదివారం భాగల్పూర్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడానికి బీజేపీనే కారణమని బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. "బీజేపీ వంతెన కూలిపోవడానికి కారణమైంది. మేము వంతెనలను నిర్మిస్తాము.. బీజేపీ వాటిని నాశనం చేస్తూనే ఉంది" అని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు భారతదేశానికి చెందినవారు కాదని, వాస్తవానికి రష్యా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందినవారని ఆయన ఆరోపించారు.
టీవీ చర్చల్లో నిత్యం ఉండే జేడీ(యూ) మాజీ నేత అజయ్ అలోక్ శుక్రవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడం అనేది ఒక కుటుంబంలోకి వచ్చినట్లే అని, మోదీ మిషన్కు సహకరిస్తానని అజయ్ అలోక్ అన్నారు.