లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్లో రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో రెండోసారి అడుగు పెట్టనున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం పశ్చిమ చంపారన్ జిల్లా ప్రధాన కార్యాలయం బెట్టియా పట్టణాన్ని సందర్శించి రూ.12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.
బీహార్లో జేడీయూ బీజేపీ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీష్ సర్కారు నేడు బలపరీక్షను ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై విశ్వాసం కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత నితీష్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలన్నారు. వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకధాటిపైకి రావాలనుకున్నాయి. అంతే తడువుగా ఆయా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాడ్డాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించుకున్నాయి. సీట్లు సర్దుబాటు.. క్యాంపెయిన్, తదితర అంశాలపై బాగానే మేథోమదనం చేశాయి. ప్రజల్లో ఒక విధమైన సానుకూల పవనాలు కూడా వీచాయి. ఇంతలో కూటమి తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క కుదుపు కుదిపి మూడు…
బీహార్లో నితీష్కుమార్ సారథ్యంలో బీజేపీ-జేడీయూ కూటమి ఆదివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెప్ట్పార్టీల కూటమి నుంచి బయటకు వచ్చి కమలం పార్టీతో మద్దతు మరోసారి నితీష్కుమార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా నితీష్ తీరుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఆయన తీరును తీవ్రంగా ఖండించాయి.
Mallikarjun Kharge: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ఆరోపించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని చీకట్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేశారని ఆదివారం దుయ్యబట్టారు.
Sanjay Raut: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, బీహార్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎన్డీయేతో జతకట్టాడు. బీజేపీ మద్దతుతో నిన్న 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీష్, ఎన్డీయేలో చేరడం కూటమి జీర్ణించుకోలేకపోతోంది. ఇదిలా ఉంటే ఆ కూటమిలోని కీలక పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే నితీష్ కుమార్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
DMK: జేడీయూ నేత, బీహార్ సీఎం ఇండియా కూటమి నుంచి, ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరారు. దీంతో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, డీఎంకేల నుంచి నితీష్ కుమార్పై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా డీఎంకే నేత టీఆర్ బాలు మాట్లాడుతూ.. ఇండియా కూటమి కోసం నితీష్ కుమార్ ‘‘హిందీ’’ని కూడా భరించామని ఆయన అన్నారు. ఇండియా కూటమిలో ఆయన సమస్యాత్మకంగా ఉన్నారని అన్నారు.
PM Modi: బీహార్ ముఖ్యమంత్రిగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీజేపీ మద్దతుతో మరోసారి జేడీయూ-బీజేపీ సర్కార్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్, బీహార్లో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్కి అభినందనలు తెలియజేశారు.
Asaduddin Owaisi: జేడీయూ అధినేత నితీష్ కుమార్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. మరోవైపు ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే నితీష్ కుమార్ సీఎం అవుతారని, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్రమోడీ ఇష్టం మేరకే పాలన సాగుతుందని ఆయన అన్నారు. మళ్లీ బీజేపీతో జేడీయూ జతకట్టడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.