Nitish Kumar: పువ్వు పార్టీతో నితీశ్కు కలిసొచ్చేదేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముచ్చటగా తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇంతవరకు ఆయన ప్రస్థానం బాగానే ఉంది. కానీ ఆయన మనసులో ఉన్న కోరిక మాత్రం తీరకుండానే పోతుంది. ఇన్నిసార్లు సీఎం సీట్లో కూర్చున్నా.. రాష్ట్ర పరిథి దాటలేకపోయారు. అందుకోసమే ఈసారైనా హస్తినకు పోవాలని స్కెచ్ వేశారు. కానీ ఆయన మాస్టర్ ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇంత సడన్గా తన ప్రణాళికను ఎందుకు మార్చుకున్నారు. మళ్లీ కమలంతో ఎందుకు జోడీ కట్టాల్సి వచ్చింది. నితీష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
Read Also: Rohini Acharya : చెత్త తిరిగి డంపులో పడింది.. నితీష్ కుమార్ పై లాలూ యాదవ్ కుమార్తె ట్వీట్
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ బలమైన శక్తిగా రాజ్యమేలుతోంది. దశాబ్ద కాలంగా మోడీ ప్రధానిగా కొనసాగుతున్నారు. మరోసారి అధికారం కోసం బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో మళ్లీ బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని.. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలన్న కోరికతో నితీష్కుమార్ ఇండియా కూటమి ఏర్పాటుకు పావులు కదిపారు. అనుకున్నట్టుగానే కూటమి ఏర్పడింది. కానీ ఆదిలోనే ఆయన ఆశలు గల్లంతయ్యాయి. ఇండియా అధ్యక్షుడిగా తనకు కాకుండా ఖర్గేకు ఇవ్వడం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు తాజాగా మరోసారి బీజేపీతో నితీష్ జత కట్టారు. కేంద్రంలో అయితే పువ్వు పార్టీ పూర్తి మెజార్టీతో ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల మద్దతు లేకుండానే కాషాయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది. ముచ్చటగా మూడోసారి కూడా అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్డీఏలో జేడీయూ చేరడం వల్ల నితీష్కు కలిసొచ్చేదేంటి? నితీష్కు ఏమైనా అవకాశం ఉంటుందా? అంటే ఏ మాత్రం ఉండదు. తిరిగి మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ మోడీనే ప్రధాని పీఠంపై కూర్చుంటారు. లేదంటే ఆ పార్టీలోని ముఖ్యనేత ఎవరైనా ఈ సీట్లు కూర్చుంటారే తప్ప మరొకరికి ఛాన్సుండదు. మరీ ఢిల్లీ పీఠంపై కూర్చోవాలనుకున్న నితీష్ కల నెరవేరకుండానే పోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి నితీష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిం
తాజావార్తలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..