Bihar Crisis: ఈరోజు నితీష్ ప్లాన్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చాపకింద నీరులా చకచక మార్పులు, చేర్పులు జరిగిపోతుంటాయి. ఇందుకు బీహార్లో చోటుచేసుకున్న పరిణామాలే ఉదాహరణ. నిన్నటిదాకా నితీష్కుమార్ నాయకత్వంలో సాఫీగా సాగిపోతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి నితీష్కుమార్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా మహాకూటమి అవాక్కైంది. ఆర్జేడీ, కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీతో దోస్తీ కట్టేందుకు నితీష్ రెడీ అయిపోయారు. ఈ అనూహ్య నిర్ణయంతో ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు నిశ్చేష్టులయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ నితీష్ ప్లేట్ ఫిరాయించడంతో ఇండియా కూటమి కూడా ఝలక్కు గురైంది.
Read Also: Nitish Kumar: నేడు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా..?
Also Read
- Punjab: అమృత్సర్లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
ముఖ్యమంత్రి నితీష్కుమార్ ఈరోజే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మహాకూటమికి స్వస్తి పలికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే రాజ్భవన్లో గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను నితీష్కుమార్ సమర్పించనున్నారు. ఇప్పటికే జేడీయూ ఎమ్మెల్యేలంతా పట్నాకు చేరుకున్నారు. అంతేకాకుండా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీష్కు జైకొట్టినట్లు సమాచారం అందుతోంది. మొత్తం మీద కమలనాథులతో కలిసి నితీష్కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: OU Registrar: మరోసారి జరగదు.. విద్యార్థినుల రక్షణ మాదే.. ఓయూ రిజిస్టార్ క్లారిటీ
ఆదివారమే మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నితీష్ చర్యలపై మహాకూటమి సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. నితీష్కుమార్ విశ్వసనీయతను కోల్పోయారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీహార్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంతో ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయి. వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పాటుకు నితీష్ కీలక పాత్ర పోషించారు. కానీ కూటమి అధ్యక్షుడిగా తనను కాకుండా మల్లిఖార్జున ఖర్గేను ఎంచుకోవడంపై నితీష్ అలకబూనినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్సర్లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!