Bihar Crisis: ఈరోజు నితీష్ ప్లాన్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చాపకింద నీరులా చకచక మార్పులు, చేర్పులు జరిగిపోతుంటాయి. ఇందుకు బీహార్లో చోటుచేసుకున్న పరిణామాలే ఉదాహరణ. నిన్నటిదాకా నితీష్కుమార్ నాయకత్వంలో సాఫీగా సాగిపోతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి నితీష్కుమార్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా మహాకూటమి అవాక్కైంది. ఆర్జేడీ, కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీతో దోస్తీ కట్టేందుకు నితీష్ రెడీ అయిపోయారు. ఈ అనూహ్య నిర్ణయంతో ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు నిశ్చేష్టులయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ నితీష్ ప్లేట్ ఫిరాయించడంతో ఇండియా కూటమి కూడా ఝలక్కు గురైంది.
Read Also: Nitish Kumar: నేడు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా..?
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ముఖ్యమంత్రి నితీష్కుమార్ ఈరోజే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మహాకూటమికి స్వస్తి పలికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే రాజ్భవన్లో గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను నితీష్కుమార్ సమర్పించనున్నారు. ఇప్పటికే జేడీయూ ఎమ్మెల్యేలంతా పట్నాకు చేరుకున్నారు. అంతేకాకుండా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీష్కు జైకొట్టినట్లు సమాచారం అందుతోంది. మొత్తం మీద కమలనాథులతో కలిసి నితీష్కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: OU Registrar: మరోసారి జరగదు.. విద్యార్థినుల రక్షణ మాదే.. ఓయూ రిజిస్టార్ క్లారిటీ
ఆదివారమే మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నితీష్ చర్యలపై మహాకూటమి సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. నితీష్కుమార్ విశ్వసనీయతను కోల్పోయారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీహార్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంతో ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయి. వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పాటుకు నితీష్ కీలక పాత్ర పోషించారు. కానీ కూటమి అధ్యక్షుడిగా తనను కాకుండా మల్లిఖార్జున ఖర్గేను ఎంచుకోవడంపై నితీష్ అలకబూనినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!