బీహార్లో నితీష్కుమార్ సారథ్యంలో బీజేపీ-జేడీయూ కూటమి ఆదివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెప్ట్పార్టీల కూటమి నుంచి బయటకు వచ్చి కమలం పార్టీతో మద్దతు మరోసారి నితీష్కుమార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా నితీష్ తీరుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఆయన తీరును తీవ్రంగా ఖండించాయి.
Mallikarjun Kharge: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ఆరోపించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని చీకట్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేశారని ఆదివారం దుయ్యబట్టారు.
Sanjay Raut: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, బీహార్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎన్డీయేతో జతకట్టాడు. బీజేపీ మద్దతుతో నిన్న 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీష్, ఎన్డీయేలో చేరడం కూటమి జీర్ణించుకోలేకపోతోంది. ఇదిలా ఉంటే ఆ కూటమిలోని కీలక పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే నితీష్ కుమార్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
DMK: జేడీయూ నేత, బీహార్ సీఎం ఇండియా కూటమి నుంచి, ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరారు. దీంతో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, డీఎంకేల నుంచి నితీష్ కుమార్పై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా డీఎంకే నేత టీఆర్ బాలు మాట్లాడుతూ.. ఇండియా కూటమి కోసం నితీష్ కుమార్ ‘‘హిందీ’’ని కూడా భరించామని ఆయన అన్నారు. ఇండియా కూటమిలో ఆయన సమస్యాత్మకంగా ఉన్నారని అన్నారు.
PM Modi: బీహార్ ముఖ్యమంత్రిగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీజేపీ మద్దతుతో మరోసారి జేడీయూ-బీజేపీ సర్కార్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్, బీహార్లో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్కి అభినందనలు తెలియజేశారు.
Asaduddin Owaisi: జేడీయూ అధినేత నితీష్ కుమార్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. మరోవైపు ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే నితీష్ కుమార్ సీఎం అవుతారని, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్రమోడీ ఇష్టం మేరకే పాలన సాగుతుందని ఆయన అన్నారు. మళ్లీ బీజేపీతో జేడీయూ జతకట్టడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 9వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.
Tejashwi Yadav: బీహార్లో మరోసారి బీజేపీ-జేడీయూ ప్రభుత్వం కొలువదీరబోతోంది. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఎన్డీయే కూటమిలోకి సీఎం నితీష్ కుమార్ చేరిపోయారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. ఇదిలా ఉంటే మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ ముఖ్యనేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా మాట్లాడారు.
జేడీయూ అధినేత నితీష్కుమార్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. బీహార్లోనే కాదు దేశంలోనే నితీష్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన 8 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించబోతున్నారు.
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ మద్దతుతో సీఎంగా అధికారం చేపట్టనున్నారు. 2019 ఎన్నికల ముందు ఇలాగే ఆర్జేడీ పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసారు. ప్రస్తుతం 2024 ఎన్నికల ముందు కూడా ఇదే విధమైన వ్యూహాన్ని అనుసరించారు.