Bihar Politics: ‘‘మమతతో కలిసి కాంగ్రెస్ కుట్ర, అందుకే వైదొలిగాం’’.. జేడీయూ సంచలన ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు బలం మరింత పెరిగింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పార్టీ, సీఎం నితీష్ కుమార్ వైదొలిగారు. రెండు రోజులుగా నెలకొన్న అనిశ్చితిపై ఈ రోజు క్లారిటీ వచ్చింది. ఆదివారం సీఎం నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్కి సమర్పించారు, సాయంత్రం 5 గంటలకు బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండనున్నారు.
ఇదిలా ఉంటే నితీష్ నేతృత్వంలోని జేడీయూ, ఇండియా కూటమి, ఆర్జేడీపై సంచలన ఆరోపణలు చేసింది. బీహార్లో ఆర్జేడీతో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి పనిచేయకలేకపోవడం వల్లే నిర్ణయం తీసుకున్నట్లు నితీష్ కుమార్ చెప్పారు. పార్టీ సభ్యులతో సంప్రదింపులు జరిగిన తర్వాత సంకీర్ణం నుంచి వైదొలగాలని సలహాలు వచ్చాయని ఆయన అన్నారు. ఇక ఇండియా కూటమి పతానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని జేడీయూ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది.
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
Read Also: Bihar Politics: సీఎంగా నితీష్.. బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసింది. సంకీర్ణ నాయకత్వాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగా ఆరోపించారు. కూటమిలో నాయకత్వంతో సం తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. ‘‘డిసెంబర్ 19న ఇండియా కూటమి కుట్ర ద్వారా మల్లికార్జున ఖర్గే పేరును(ప్రధానమంత్రి)గా ప్రకటించారు. ఒది కుట్రద్వారా, మమతా బెనర్జీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇతర పార్టీలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాయి’’ అని త్యాగి అన్నారు. సీట్ల పంపకాల ప్రక్రియను కాంగ్రెస్ తప్పుగా వ్యవహరిస్తోందని, మిత్రపక్షాలపై అసమానమైన డిమాండ్లు చేస్తే ఇతర నాయకుల్ని అవమానాలకు గురిచేస్తోందని జేడీయూ ఆరోపించింది. కాంగ్రెస్ చర్యలు ఇండియా కూటమి ఐక్యతకు హానికరంగా ఉన్నాయని చెప్పింది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి కూటమి వద్ద ప్రణాళికలు లేవని కేసీ త్యాగి అన్నారు.
తాజావార్తలు
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!