Bihar Politics: ‘‘మమతతో కలిసి కాంగ్రెస్ కుట్ర, అందుకే వైదొలిగాం’’.. జేడీయూ సంచలన ఆరోపణ..
Bihar Politics: లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు బలం మరింత పెరిగింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పార్టీ, సీఎం నితీష్ కుమార్ వైదొలిగారు. రెండు రోజులుగా నెలకొన్న అనిశ్చితిపై ఈ రోజు క్లారిటీ వచ్చింది. ఆదివారం సీఎం నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్కి సమర్పించారు, సాయంత్రం 5 గంటలకు బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండనున్నారు.
ఇదిలా ఉంటే నితీష్ నేతృత్వంలోని జేడీయూ, ఇండియా కూటమి, ఆర్జేడీపై సంచలన ఆరోపణలు చేసింది. బీహార్లో ఆర్జేడీతో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి పనిచేయకలేకపోవడం వల్లే నిర్ణయం తీసుకున్నట్లు నితీష్ కుమార్ చెప్పారు. పార్టీ సభ్యులతో సంప్రదింపులు జరిగిన తర్వాత సంకీర్ణం నుంచి వైదొలగాలని సలహాలు వచ్చాయని ఆయన అన్నారు. ఇక ఇండియా కూటమి పతానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని జేడీయూ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది.
Also Read
- Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
- PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
- Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
Read Also: Bihar Politics: సీఎంగా నితీష్.. బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసింది. సంకీర్ణ నాయకత్వాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగా ఆరోపించారు. కూటమిలో నాయకత్వంతో సం తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. ‘‘డిసెంబర్ 19న ఇండియా కూటమి కుట్ర ద్వారా మల్లికార్జున ఖర్గే పేరును(ప్రధానమంత్రి)గా ప్రకటించారు. ఒది కుట్రద్వారా, మమతా బెనర్జీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇతర పార్టీలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాయి’’ అని త్యాగి అన్నారు. సీట్ల పంపకాల ప్రక్రియను కాంగ్రెస్ తప్పుగా వ్యవహరిస్తోందని, మిత్రపక్షాలపై అసమానమైన డిమాండ్లు చేస్తే ఇతర నాయకుల్ని అవమానాలకు గురిచేస్తోందని జేడీయూ ఆరోపించింది. కాంగ్రెస్ చర్యలు ఇండియా కూటమి ఐక్యతకు హానికరంగా ఉన్నాయని చెప్పింది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి కూటమి వద్ద ప్రణాళికలు లేవని కేసీ త్యాగి అన్నారు.
తాజావార్తలు
-
Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
-
Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
-
Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
-
Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!