Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరానికి చేరుకునే అతి తీవ్రమైన తుఫాను ‘మోచా’తో దేశంలోని తీర ప్రాంతాలు, ఓడరేవులలో ఆందోళనలు పెరుగుతున్నాయి. మూడు ఓడరేవులు, 12 జిల్లాలకు భారీ ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాద హెచ్చరిక నం.8ను దేశ వాతావరణ కార్యాలయం జారీ చేసింది.
మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుఫాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. ఆ తర్వాత తుఫాను మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పాకిస్థాన్కు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం సపోర్ట్ ఇవ్వడం లేదు. ఆసియా కప్ విషయంలో బంగ్లాదేశ్, శ్రీలంకల మద్దతు పాకిస్థాన్కు లభించడం లేదు. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు BCCI వైపే తమ మద్దతును ప్రకటించాయి.
Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మైనారిటీల దాడులు జరుగుతన్నాయంటే అక్కడ పట్టించుకునే ప్రభుత్వమే లేదు. తాజాగా తనను నిరాకరించందనే కోపంతో హిందూ బాలికను అత్యంతదారుణంగా హత్య చేశాడో ముస్లిం వ్యక్తి. బంగ్లాదేశ్ లోని తూర్పు జిల్లా నేత్రకోనాలోని బర్హట్టా సబ్ డిస్ట్రిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ముక్తి బర్మన్ (16) అనే హిందూ బాలికను కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రసిద్ధ క్లాత్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది, ఫలితంగా భారీ నష్టం జరిగింది. ఢాకాలోని ప్రసిద్ధ బట్టల మార్కెట్ అయిన బంగా బజార్లో అగ్నిప్రమాదం సంభవించింది. పరిసరాలను నల్లటి పొగతో కప్పివేసింది.
బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్లోని మదారిపూర్లోని శిబ్చార్ ఉపజిల్లాలోని కుతుబ్పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోవడంతో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.