Imran Khan: “బంగ్లాదేశ్” లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు.. ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్..
Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
పాకిస్తాన్ విపత్తు దిశగా వెళ్తుందోన ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పాకిస్తాన్ లోని 70 శాతం జనాబా తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని, 30 శాతం మంది మాత్రమే పీఎం షహబాజ్ షరీఫ్ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ఓ సర్వేలో తేలిందని ఆయన అన్నారు. సైన్యాన్ని తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంచడానికి అధికార పార్టీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. బుధవారం లాహోర్ లోని అతని నివాసం జమాన్ పార్క్ లో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణే పాకిస్తాన్ సమస్యకు పరిష్కారం అని ఆయన అన్నారు.
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
Read Also: BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
లండన్ లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశం గురించి పట్టింపు లేదని, కేవలం దోచుకున్న సంపదను కాపాడుకోవడానికి తమ స్వార్థ ప్రయోజనాల కోసమే చూస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో తూర్పు పాకిస్తాన్( బంగ్లాదేశ్) పరిస్థితిని ఎదుర్కొంటోందని, హెచ్చరించారు. తాను సైన్యంపై చేసిన విమర్శలను తండ్రి కొడుకులను మందలించిన విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ అంతర్గత విషయాల్లో సైన్యం జోక్యం చేసుకోవద్దని మరోసారి సూచించారు. తన ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు ఉన్నారని పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల్ని కుట్రగా అభివర్ణించారు. తన ఇంట్లో ఎలాంటి ఉగ్రవాదులు లేరని నిరూపించేందుకు మీడియాను ఇమ్రాన్ తన ఇంట్లోకి అనుమతించారు.
మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో 10 మంది చనిపోయినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు, అయితే తమ కార్యకర్తలు 40 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్ లపై స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తనను లక్ష్యంగా చేసుకుని అమెరికా గద్దె దించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!