Imran Khan: “బంగ్లాదేశ్” లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు.. ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
పాకిస్తాన్ విపత్తు దిశగా వెళ్తుందోన ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పాకిస్తాన్ లోని 70 శాతం జనాబా తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని, 30 శాతం మంది మాత్రమే పీఎం షహబాజ్ షరీఫ్ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ఓ సర్వేలో తేలిందని ఆయన అన్నారు. సైన్యాన్ని తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంచడానికి అధికార పార్టీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. బుధవారం లాహోర్ లోని అతని నివాసం జమాన్ పార్క్ లో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణే పాకిస్తాన్ సమస్యకు పరిష్కారం అని ఆయన అన్నారు.
Also Read
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
- Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
- ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
Read Also: BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
లండన్ లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశం గురించి పట్టింపు లేదని, కేవలం దోచుకున్న సంపదను కాపాడుకోవడానికి తమ స్వార్థ ప్రయోజనాల కోసమే చూస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో తూర్పు పాకిస్తాన్( బంగ్లాదేశ్) పరిస్థితిని ఎదుర్కొంటోందని, హెచ్చరించారు. తాను సైన్యంపై చేసిన విమర్శలను తండ్రి కొడుకులను మందలించిన విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ అంతర్గత విషయాల్లో సైన్యం జోక్యం చేసుకోవద్దని మరోసారి సూచించారు. తన ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు ఉన్నారని పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల్ని కుట్రగా అభివర్ణించారు. తన ఇంట్లో ఎలాంటి ఉగ్రవాదులు లేరని నిరూపించేందుకు మీడియాను ఇమ్రాన్ తన ఇంట్లోకి అనుమతించారు.
మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో 10 మంది చనిపోయినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు, అయితే తమ కార్యకర్తలు 40 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్ లపై స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తనను లక్ష్యంగా చేసుకుని అమెరికా గద్దె దించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!