Imran Khan: “బంగ్లాదేశ్” లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు.. ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
పాకిస్తాన్ విపత్తు దిశగా వెళ్తుందోన ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పాకిస్తాన్ లోని 70 శాతం జనాబా తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని, 30 శాతం మంది మాత్రమే పీఎం షహబాజ్ షరీఫ్ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ఓ సర్వేలో తేలిందని ఆయన అన్నారు. సైన్యాన్ని తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంచడానికి అధికార పార్టీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. బుధవారం లాహోర్ లోని అతని నివాసం జమాన్ పార్క్ లో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణే పాకిస్తాన్ సమస్యకు పరిష్కారం అని ఆయన అన్నారు.
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
Read Also: BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
లండన్ లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశం గురించి పట్టింపు లేదని, కేవలం దోచుకున్న సంపదను కాపాడుకోవడానికి తమ స్వార్థ ప్రయోజనాల కోసమే చూస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో తూర్పు పాకిస్తాన్( బంగ్లాదేశ్) పరిస్థితిని ఎదుర్కొంటోందని, హెచ్చరించారు. తాను సైన్యంపై చేసిన విమర్శలను తండ్రి కొడుకులను మందలించిన విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ అంతర్గత విషయాల్లో సైన్యం జోక్యం చేసుకోవద్దని మరోసారి సూచించారు. తన ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు ఉన్నారని పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల్ని కుట్రగా అభివర్ణించారు. తన ఇంట్లో ఎలాంటి ఉగ్రవాదులు లేరని నిరూపించేందుకు మీడియాను ఇమ్రాన్ తన ఇంట్లోకి అనుమతించారు.
మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో 10 మంది చనిపోయినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు, అయితే తమ కార్యకర్తలు 40 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్ లపై స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తనను లక్ష్యంగా చేసుకుని అమెరికా గద్దె దించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!