Imran Khan: “బంగ్లాదేశ్” లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు.. ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
పాకిస్తాన్ విపత్తు దిశగా వెళ్తుందోన ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పాకిస్తాన్ లోని 70 శాతం జనాబా తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని, 30 శాతం మంది మాత్రమే పీఎం షహబాజ్ షరీఫ్ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ఓ సర్వేలో తేలిందని ఆయన అన్నారు. సైన్యాన్ని తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంచడానికి అధికార పార్టీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. బుధవారం లాహోర్ లోని అతని నివాసం జమాన్ పార్క్ లో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణే పాకిస్తాన్ సమస్యకు పరిష్కారం అని ఆయన అన్నారు.
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Read Also: BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
లండన్ లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశం గురించి పట్టింపు లేదని, కేవలం దోచుకున్న సంపదను కాపాడుకోవడానికి తమ స్వార్థ ప్రయోజనాల కోసమే చూస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో తూర్పు పాకిస్తాన్( బంగ్లాదేశ్) పరిస్థితిని ఎదుర్కొంటోందని, హెచ్చరించారు. తాను సైన్యంపై చేసిన విమర్శలను తండ్రి కొడుకులను మందలించిన విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ అంతర్గత విషయాల్లో సైన్యం జోక్యం చేసుకోవద్దని మరోసారి సూచించారు. తన ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు ఉన్నారని పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల్ని కుట్రగా అభివర్ణించారు. తన ఇంట్లో ఎలాంటి ఉగ్రవాదులు లేరని నిరూపించేందుకు మీడియాను ఇమ్రాన్ తన ఇంట్లోకి అనుమతించారు.
మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో 10 మంది చనిపోయినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు, అయితే తమ కార్యకర్తలు 40 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్ లపై స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తనను లక్ష్యంగా చేసుకుని అమెరికా గద్దె దించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!