Asia Cup 2022: ఆసియా కప్లో తొలి మ్యాచ్లో ఆప్ఘనిస్తాన్ చేతిలో భంగపడ్డ శ్రీలంక.. రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించి సూపర్-4 బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 180కి పైగా పరుగులు చేసినా శ్రీలంక ఛేదించి 2 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అటు శ్రీలంకపై పరాజయంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. ముఖ్యంగా శ్రీలంకతో మ్యాచ్లో చివరి ఓవర్లో…
బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అస్సాంలోని బొంగైగావ్ జిల్లాలో ఒక ప్రైవేట్ మదర్సాను బుధవారం కూల్చివేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆగస్టు నెలలో కూల్చివేయబడిన మూడో ప్రైవేట్ మదర్సా ఇది. మదర్సా ఉపాధ్యాయుడు హఫీజుర్ రెహమాన్ను ఆగస్టు 26న అరెస్టు చేసిన కొద్ది రోజులకే మళ్లీ మదర్సాను కూల్చివేశారు. ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆగస్టు 21న సమీపంలో ఉన్న గోల్పరా జిల్లాలో పట్టుబడిన ఇద్దరు…
Himanta Biswa Sarma Comments On Terrorism in Assam: ఇస్లామిక్ ఛాందసవాదుకులు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా మారుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదు నెల్లలో అస్సాంలో 5 టెర్రర్ మాడ్యూల్స్ పట్టుబడటం ఆందోళనకు తావిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల అస్సాంలో పలు ప్రాంతాల్లో అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ముస్తఫాను భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ముస్తఫా మోరిగావ్ ప్రాంతంలో మదర్సా…
Manohar Lal Khattar - Pak, Bangladesh, India Can Unite: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశంలో దాయాది దేశం పాకిస్తాన్, మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ లు విలీనం అవుతాయిన వ్యాఖ్యానించారు. గురుగ్రామ్ లో మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా శిక్షణా శిబిరంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ మోర్చాలో ఆయన సోమవారం మాట్లాడారు.
బంగ్లాదేశ్ ప్రజల చిరకాల కల ఈ బ్రిడ్జ్. ఎన్నో అడ్డంకులు దాటుకుని తాజాగా శనివారం ప్రారంభం అయింది. దేశ ప్రధాని షేక్ హసీనా దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు, రైలు వంతెనను ప్రారంభించారు. పూర్తిగా దేశీయ నిధులతో ఎలాంటి విదేశీ సాయం లేకుండా ఈ వంతెన నిర్మించారు. రాజధాని ఢాకాతో నైరుతి బంగ్లాదేశ్ ను కలిపేందుకు ఈ బ్రిడ్జ్ ఎంతగానో సహాయపడుతుంది. పద్మ నదిపై 6.15 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల రోడ్డు-రైలు వంతెనను నిర్మించారు. బంగ్లాదేశ్…
భారత్-బంగ్లాదేశ్ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హరిదాస్పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్లోని భారత…
కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. గత రెండేళ్ల నుంచి గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగాలపై ప్రభావం పడింది. ఇప్పటికీ శ్రీలంక వంటి దేశాలు కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కరోనా కారణంగా ఎక్కడిక్కడ దేశాలు ఆంక్షలు, లాక్ డౌన్లు విధించుకున్నాయి. దీంతో ఇతర దేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్స్, రైళ్లు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల క్రితం కోవిడ్…
డర్బన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ ధాటికి 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. గతంలో 2018లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 43 పరుగులకే ఆలౌటై బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. డర్బన్ వేదికగా జరిగిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. కాగా…
పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు ఇది నిజంగా చేదువార్తే. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్లో టీమిండియా వైట్ వాష్కు గురైన చోట బంగ్లాదేశ్ మాత్రం చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ విజయం సాధించింది. బుధవారం రాత్రి సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్…