ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే మళ్లీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల మరలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలనందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతడిని…
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ వద్ద జీపు దిగి లోపలికి వెళుతూ ఉండగా.. అకస్మాత్తుగా డ్రైవర్ జీపును ముందుకు కదిలించాడు. జీపు తగిలి పోసాని త్రూలి పడబోయారు. పక్కనే ఉన్న పోలీసులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం పోసాని ఓబులవారిపల్లె పీఎస్లోకి వెళ్లిపోయారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యుడు…
తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు చీటర్లు. చిట్టిల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మరో కేటుగాడి కేసు వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల మేర నట్టేట ముంచినట్లు తెలిసింది. హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్ సీ టైప్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్లయ్య ఈ మోసానికి పాల్పడ్డాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సీఎం ఓటు వేశారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి యూపీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేశ్ చేరుకుని ఓటు వేశారు. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు…
మన తరుపున పోరాడుతూ.. మన కష్టాలపై మాట్లాడే వ్యక్తికి ఓటు వేయండని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నిక ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం అని, చైతన్య వంతులైన విద్యావంతులు పనిచేసే వారికి మద్దతుగా నిలవాలన్నారు. పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. తమలోని చైతన్యాన్ని చూపాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలోఎమ్మెల్యే రాము…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90…
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. మార్చి 3న నోటిఫికేషన్.. మర్చి 20న పోలింగ్, కౌంటింగ్ జరగనున్నాయి. తెలంగాణలో 5 , ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29తో ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలు: 1.మహమ్మద్ మహమూద్ అలీ 2.సత్యవతి రాథోడ్ 3.శేరి…
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదని.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం…
మన అకేషన్స్ కోసం పరీక్షలు అస్సలు వాయిదా పడవు. అందుకే పరీక్షలు ఉన్నప్పుడు.. పెళ్లి, ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతాం. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా పెళ్లి ముహూర్తం రోజున పరీక్ష రాయాల్సి వస్తుంది. అప్పుడు చాలా మంది తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఓ వధువు మాత్రం అలా అనుకోలేదు. ఉదయం పెళ్లి చేసుకుని.. నేరుగా పరీక్షా హాలుకి చేరుకుంది. ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10…