Wife Killed Husband: పెళ్లైన నెల రోజులకే.. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband: ఈ మధ్యకాలంలో భర్తలపై భార్యలు చేస్తుస్తున్న ఘోరాలు రోజురోజుకు ఎక్కువతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలో ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యను అజయ్ అనే యువకుడి భార్య, ఆమె ప్రియుడు, మరో యువకుడు కలిసి చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం ఆధారాలను దాచిపెట్టేందుకు నిందితులు శవాన్ని బైక్ కింద పెట్టి ఘటనను రోడ్డు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. మార్చి 8న డయల్ 112 ద్వారా రజనియా కట్రా గ్రామం సమీపంలోని అడవిలో రోడ్డుకి పక్కన ఒక యువకుడి శవం బైక్ కింద ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తులో మృతుడు ఖంతరా గ్రామానికి చెందిన అజయ్ వైశ్య (24)గా గుర్తించారు.
Also Read
- Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
- Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
- Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
దీనితో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. అతని సోదరుడు వినయ్ వైశ్య అక్కడికి చేరుకున్నాడు. అజయ్ కు ఫిబ్రవరి 12న గన్నై గ్రామానికి చెందిన ఉమా వైశ్యతో వివాహం జరిగినట్లు తెలిపారు. మార్చి 7 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అజయ్ తన అత్తింటి గన్నై గ్రామానికి మోటార్సైకిల్పై వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరినట్లు తెలిపారు. అయితే అతను అక్కడికి చేరకపోవడంతో పాటు తిరిగి ఇంటికీ రాలేదు. అయితే మరుసటి రోజు అతని మరణ వార్త వారికి తెలిసింది.
సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించగా ఆ ఘటన అనుమానాస్పదంగా కనిపించింది. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయి. అలాగే మోటార్ సైకిల్ ను ప్రమాదంలా కనిపించేలా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలను సేకరించారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో కూడా హత్య అనుమానం వ్యక్తమవడంతో పోలీసులు గుర్తు తెలియని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ మనీష్ ఖత్రి నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రూ.10 వేల బహుమతిని ప్రకటించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఉమా వైశ్యను పోలీసులు విచారించగా ఆమె నిజం ఒప్పుకుంది. పెళ్లికి ముందే తనకు అమర్ బహాదూర్ వైశ్యతో ప్రేమ సంబంధం ఉన్నట్లు, అతనితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. కానీ కుటుంబ ఒత్తిడితో తనను అజయ్తో వివాహం చేసుకున్నానని, అందువల్ల తాను సంతోషంగా లేనని వెల్లడించింది.
YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!
ఈ కారణంగానే ఉమా తన ప్రియుడు అమర్ బహాదూర్ వైశ్యతో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది. ప్లాన్ ప్రకారం మార్చి 7న ఉమా అజయ్ ను కలవాలని చెప్పి తన పుట్టింటికి రావాలని పిలిచింది. ఆ తర్వాత అతను వస్తున్నాడని తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. దీంతో అమర్ బహాదూర్ తన సహచరుడు చంద్రప్రతాప్ అలియాస్ చందన్ వైశ్యతో కలిసి బొలెరో వాహనంలో అక్కడికి వచ్చి అజయ్ను వెంబడించారు. రాత్రి సుమారు 9 నుంచి 10 గంటల మధ్య రజనియా కట్రా అడవిలోని ఓ ప్రాంతంలో నిందితులు అజయ్ మోటార్ సైకిల్ ను ఆపి.. అనంతరం మెడికల్ గ్లోవ్స్ ధరించి గమ్ఛాతో అతని గొంతు నులిమి, రాయితో తలపై పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు.
హత్య అనంతరం ఘటనను ప్రమాదంలా చూపించేందుకు మృతదేహం దగ్గర మోటార్ సైకిల్ ను ఉంచారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, ఘటనలో ఉపయోగించిన బొలెరో వాహనం సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!