నాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ ప్రజా సమస్యలు, పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమయ్యారు. ఇవాళ ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు వివరణ కోరనున్నారు. అలాగే ప్రభుత్వ…
నాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వి.బి.జి రామ్ జీ జాబ్ కార్డులు, పీపీపీ మోడల్ కింద ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు, రెవిన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న కేసులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. Also Read: YS Jagan: నేడు…
YS Jagan to Visit Araku and Visakhapatnam Today: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని తంగుల్గూడా గ్రామంలో ఉన్న రాధాకృష్ణ ఆలయానికి జగన్ చేరుకోనున్నారు. అక్కడ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. Also…
అమెరికాకు ఎవరు ఎదురు తిరిగినా వారిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్దం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇరాన్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే ప్రయత్నంగా యుద్దం చేస్తుందన్నారు. దురాక్రమణ చేసేందుకే పలు కారణాలు చూపి యుద్దం ప్రారంభించిందని అమెరికాపై మండిపడ్డారు. ప్రధాని మోడీ చొరవ తీసుకుని ప్రపంచ దేశాల సమన్వయంతో ట్రంప్తో మాట్లాడి యుద్దం ఆపేలా ప్రయత్నం చేయాలని…
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన మొదటి భార్యతో పాటు అత్తను కత్తితో నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జననివాస ప్రాంతాల్లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికుల వివరాల మేరకు డబుల్ మర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి.. చోడదాసి సీతారామరాజు తన మొదటి భార్య లత…
లండన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 23న దక్షిణ లండన్లోని క్రోయ్డాన్లో అద్దె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇదే ఇంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉంటున్నారు.
Ambati Rambabu Warns Pemmasani Chandrasekhar over Arrest Controversy: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పి.. పెద్ద సినిమా చూపించారన్నారు. ఎలాగా 18 రోజులు సినిమా చుపించావ్ అని ఎద్దేవా చేశారు. ఇల్లు పగలగొట్టడంలో, కార్లు ధ్వంసం చేయడంలో, ఆఫీస్ ధ్వంసం చేయడంలో, భార్యా బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమికొట్టడంలో, లాకప్లో పడేసేలా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో మరోసారి ఊరట లభించింది. సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను గుంటూరు జిల్లా కోర్టు బుధవారం తిరస్కరించింది. అంబటి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన బిల్గేట్స్కు మంత్రి నారా లోకేష్ స్వగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ బిల్గేట్స్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో బిల్గేట్స్ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. బిల్గేట్స్ వెంట ఆయన ప్రతినిధి బృందం సభ్యులు మైఖేల్ థియోడార్…
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్కు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమస్య ఎదురైంది. పొగమంచు కారణంగా ల్యాండింగ్కు అంతరాయం కలిగింది. దీంతో ఫ్లైట్ కాసేపు విజయవాడ చుట్టూ గాల్లో చక్కర్లు కొట్టింది. పైలట్కు రన్వే సరిగా కనిపించకపోవడంతో విమానాన్ని దింపడం సాధ్యపడలేదు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాక ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండైంది. గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న గేట్స్కు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్…