ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఈగల్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత, రికార్డులను అధికారులు పరిశీలించారు. విజిలెన్స్ ఎస్పీ ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడి నాగమణి రాజమండ్రి తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. మెడికల్ గా ఒకే మోతాదులో వినియోగించే సిరఫ్, ఇంజక్షన్లు మత్తు మందులను కొంతమంది యువత అక్రమంగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో మెడికల్ షాపులలో నాలుగు ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి.
Also Read:Ireland: ఐర్లాండ్ అధ్యక్ష పదవికి యూఎఫ్సీ ఫైటర్ పోటీ.. ట్రంప్ హామీతో బరిలోకి!
రాజమండ్రిలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తిరుమల ఏజన్సీ లో విక్రయిస్తున్న ట్రమడాలు మత్తుమందు 255 ఇంజక్షన్లను విజిలెన్స్ ఎస్పీ స్నేహిత పట్టుకున్నారు. యువత కొంతమంది తప్పుడుగా వైద్యం కోసం వినియోగించే మత్తు కలిగించే మెడిసిన్స్ ను విరివిగా వాడుతున్నట్టు సమాచారం. అందుకే డిజేపీ ఆదేశాలతో జిల్లాలో 16 చోట్ల దాడులు చేస్తున్నామని తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ ఏజెన్సీలో, మెడికల్ షాపులలో ట్రమాడాల్ ఇంజక్షన్లు, మత్తు కలిగించే సెరఫ్ లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read:Gautam : యాక్టింగ్తో అదరగొట్టిన మహేశ్ కొడుకు గౌతమ్.. వీడియో వైరల్
రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ నిర్వాహిస్తున్నామని ఈగల్ టీమ్ ఐజీ రవి కృష్ణ తెలిపారు. గుణదల మెడికల్ షాప్ లో ఆకస్మిక దాడులు చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతి లేని మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలి. అలా లేనియెడల వారిపై చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ వెల్లడించారు.