UAE Ambassador: “మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది”.. యూఏఈ రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE Ambassador: ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర తరమవుతున్నాయి. మొదట ఈ మూడు దేశాలకే పరిమితమై ఘర్షణలు గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్, జోర్డాన్ వంటి దేశాలకు పాకాయి. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. ముఖ్యంగా ఇంధన సరఫరాపై తీవ్రంగా ఎఫెక్ట్ పడింది. ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో యూఏఈ రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్కు ఉన్న దౌత్యపరమైన బలాన్ని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క ఫోన్ చేస్తే చాలు ఈ యుద్ధం ముగిసిపోతుందని.. సమస్యలన్నీ సర్దుమనుగుతాయని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లోని పాలకుల్లో మోడీపై అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. అక్కడి ప్రజలు సైతం ప్రధాని మోడీకి మర్యాద ఇస్తారన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విదేశాల్లో మోడీకి ఉన్న ప్రాధాన్యత, భారత్కు ఉన్న గౌరవం గురించి చర్చ మొదలైంది.
Also Read
ఇక మరోవైపు.. గల్ఫ్ దేశాల్లో భారత్కు చెందిన అనేక మంది జీవిస్తున్నారు. వ్యాపారాలు, బతుకు దెరువు నిమిత్తం భారత్ నుంచి అక్కడికి వెళ్లారు. యుద్ధ వాతావరణం ముదరడంతో భారత్ అప్రమత్తమైంది. అక్కడున్న భారతీయులపై పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంపై ప్రధాని మోడీ ఇప్పటికే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడారు. యూఏఈపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన మోడీ, ఈ క్లిష్ట సమయంలో భారత్ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ శాంతి, భద్రతలను భారత్ ఎప్పుడూ కాంక్షిస్తుందని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!