Kandula Durgesh: స్టూడియోలు నిర్మించాలని కోరాం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం!
- మండలిలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు
- చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరాం
- ఏపీలో సినిమాలు తీసేందుకు చాల లోకేషన్లు ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరామన్నారు. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదని.. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఏపీలో సినిమాలు తీసేందుకు చాలా లోకేషన్లు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. మండలిలో విశాఖలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. వీటిపై మంత్రి సమాధానాలు ఇచ్చారు.
‘విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదు. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తాం. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన ప్రదేశం విశాఖ. సినిమాలు తీసేందుకు మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టూడియోలు నిర్మించాలని కోరాం. ఏపీలో సినిమాలు తీసేందుకు చాల లోకేషన్లు ఉన్నాయి. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరాం. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో రామానాయుడు స్టూడియో కోసం 34.44 ఎకరాలు భూమి కేటాయించారు. దానిలో కొంతభాగం 15 ఎకరాల్లో లేఅవుట్ వేసి వేరే అవసరాల కోసం వాడాలని చూశారు. ఇచ్చిన ప్రభుత్వం వేరు.. వేరే అవసరాల కోసం వాడాలని చూసిన ప్రభుత్వం వేరు’ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
‘విశాఖలో గత ప్రభుత్వాల సమయాల్లో భూకేటాయింపులు జరిగాయి. అవి ఇప్పుడు చర్చించదలుచుకోలేదు కానీ.. అక్కడ భూములు తీసుకున్న వారు స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి. భవిష్యత్తులో కాకుండా.. వెంటనే కొనసాగించే ప్రయత్నం చేయాలి’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు.
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!