Kandula Durgesh: స్టూడియోలు నిర్మించాలని కోరాం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం!
- మండలిలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు
- చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరాం
- ఏపీలో సినిమాలు తీసేందుకు చాల లోకేషన్లు ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరామన్నారు. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదని.. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఏపీలో సినిమాలు తీసేందుకు చాలా లోకేషన్లు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. మండలిలో విశాఖలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. వీటిపై మంత్రి సమాధానాలు ఇచ్చారు.
‘విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదు. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తాం. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన ప్రదేశం విశాఖ. సినిమాలు తీసేందుకు మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టూడియోలు నిర్మించాలని కోరాం. ఏపీలో సినిమాలు తీసేందుకు చాల లోకేషన్లు ఉన్నాయి. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరాం. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో రామానాయుడు స్టూడియో కోసం 34.44 ఎకరాలు భూమి కేటాయించారు. దానిలో కొంతభాగం 15 ఎకరాల్లో లేఅవుట్ వేసి వేరే అవసరాల కోసం వాడాలని చూశారు. ఇచ్చిన ప్రభుత్వం వేరు.. వేరే అవసరాల కోసం వాడాలని చూసిన ప్రభుత్వం వేరు’ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
Also Read
- Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
‘విశాఖలో గత ప్రభుత్వాల సమయాల్లో భూకేటాయింపులు జరిగాయి. అవి ఇప్పుడు చర్చించదలుచుకోలేదు కానీ.. అక్కడ భూములు తీసుకున్న వారు స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి. భవిష్యత్తులో కాకుండా.. వెంటనే కొనసాగించే ప్రయత్నం చేయాలి’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు.
తాజావార్తలు
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
-
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!