AP Legislative Council: భూములు ఇచ్చిన వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలి: ఎమ్మెల్సీ చంద్రశేఖర్
- శాసనమండలిలో నూతన పరిశ్రమల స్థాపనపై ప్రశ్నోత్తరాలు
- ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి టీజీ భరత్ సమాధానం
- 2019-24లో అసలు గృహనిర్మాణ శాఖనే పట్టించుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసనమండలిలో నూతన పరిశ్రమల స్థాపనపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ‘రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చెందితేనే పరిశ్రమలు వస్తాయని వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. కొవిడ్ సమయంలో కూడా కొత్త పరిశ్రమలు తీసుకువచ్చారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఉద్యోగ కల్పన జరగాలి. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేయాలి. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలి’ అని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కోరారు. పీ4 పాలసీలో ఎంతమందిని పారిశ్రామిక వేత్తలుగా మార్చారు?.. ఎస్సీ, ఎస్టీలకు పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు? అని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రశ్నించారు.
ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి టీజీ భరత్ సమాధానం ఇచ్చారు. ‘2014-19 వరకు నాలుగు వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చాం. 2019-24 మధ్యలో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. టెక్స్ టైల్ పాలసీ ఇచ్చి గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు.అశోక్ లేలాండ్ గత ప్రభుత్వ హయాంలో పారిపోయారు. నిన్న మళ్ళీ రీస్టార్ట్ చేయించటం జరిగింది. వాటర్ చార్జెస్ కూడా చాలా పెంచారు. పార్టనర్ షిప్ సమ్మిట్స్ కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువగా చేస్తున్నాం. 2019-24లో అసలు ఈ శాఖనే పట్టించుకోలేదు’ అని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు.
Also Read
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
మండలిలో గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… ‘పీఎంఏవై క్రింద గత ప్రభుత్వ హయాంలో 27 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే కేవలం 6 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం కోసం 2026 వరకు సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి సమయం తీసుకున్నారు. పేదలకు ఇళ్ల కోసం భారం పడకుండా చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 25 వేల ఎకరాలకు మాత్రమే భూములు కొనుగోలు చేశారు. చాలావరకు నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు అదనంగా 50 వేలు ఆర్ధిక సాయం చేస్తున్నాం’ అని తెలిపారు.
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!