AP Legislative Council: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని పీపీపీ మోడ్లో నిర్మిస్తాం!
- ఆసుపత్రుల ఆధునికీకరణపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు
- సభ్యుల ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధానం
- ఆస్పత్రుల ఆధునికీకరణకు అత్యంత ఇస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులను పీపీపీ మోడ్లో నిర్మిస్తాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో మందుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. నందిగామలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ అంశంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు వెల్లువెత్తాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
‘రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నాం. నాడు -నేడు కింద ఆస్పత్రుల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రూ.14 వేల106 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. గత ప్రభుత్వం కేవలం రూ.2445 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.246 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంలో గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లోపించింది. ఆస్పత్రులు నిర్మాణం కోసం రూ.14106 కోట్లలో నాబార్డు, కేంద్రం ద్వారా సాయం అందే అవకాశం ఉన్నా వినియోగించలేదు. ఆస్పత్రుల నిర్మాణం కోసం రాష్ట్రం రూ.3400 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా ఐదేల్లలో కేవలం రూ.963 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు’ అని మంత్రి సత్యకుమార్ చెప్పారు.
Also Read
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
‘కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చే నాటికి సూపర్ స్పషాలిటీ ఆస్పత్రుల్లో 59 శాతం ఖాళీలు ఉండగా భర్తీ ప్రక్రియ చేపట్టాం. రాష్ట్రంలో ఆస్పత్రుల ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మిస్తున్నాం. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రాష్ట్రంలో మరో 3,300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మిస్తాం. ప్రతి నియోజక వర్గంలో 100 పడకల ఆస్పత్రులను పీపీపీ మోడ్లో నిర్మిస్తాం. నందిగామ ఏరియా ఆస్పత్రి స్థానంలోనే వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తాం. నందిగామలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఆస్పత్రుల్లో మందుల సరఫరాకి గత ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయి పెట్టగా.. రూ.700 కోట్లకు పైగా చెల్లించాం. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో మందుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు’అని మంత్రి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!