AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసులో SIT దర్యాప్తు ఆధారంగా, నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SIT నివేదిక ప్రకారం, మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన కమీషన్లు, కిక్బ్యాక్లు మరియు బ్లాక్ మనీ సహాయంతో చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్లకు…
Top Maoist Leader Devji Killed: ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండు రోజులు జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు విడిచారు.. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో టాప్ లీడర్ హిడ్మా సహా ఆరుగురు మృతిచెందగా.. ఈ రోజు అల్లూరి జిల్లాలో జరిగిన తాజా ఎదురుకాల్పుల్లో మావోయిస్టు టాప్ లీడర్ దేవ్జీ సహా ఏడుగురు మృతిచెందినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో దేవ్జీ మరణం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.. దండకారణ్యం అడవుల్లో…
Mahesh Chandra Laddha: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ఎన్కౌంటర్తో కలకలం రేగింది.. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్తో ఒక్కసారిగా మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు.. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ హిడ్మా, ఆయన భార్య హేమ, మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు.. ఇక, మావోయిస్టుల ఎన్కౌంటర్, ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్ట్లపై విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటిలిజెన్స్ ADG మహేష్ చంద్ర లడ్డా.. కీలక విషయాలను వెల్లడించారు.. Read…
కాసేపట్లో పుట్టపర్తికి ప్రధాని మోడీ సత్య సాయి శత జయంతి వేడుకలకు పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కలకలలాడుతోంది. పుట్టపర్తిలో ఇంతటి జనసందోహం కనిపించడం బాబా నిర్యాణం తర్వాత ఇదే మొదటిసారి. ప్రపంచ వ్యాప్తంగా సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భగవంతుడిగా పూజలందుకునే సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భావించింది. ఇందుకోసం నెల రోజుల…
Maoists Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Madvi Hidma: మోస్ట్ వాంటెండ్ మావోయిస్ట్ మడావి హిడ్మా హతమయ్యాడు. నవంబర్ 30లోపు హిడ్మాను హతమారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంతో శపథం చేశారు. గడువుకు 12 రోజుల ముందే హిడ్మా ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. మంగళవారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ట్రై-జంక్షన్లోని దట్టమైన పుల్లగండి అడవులలో జరిగిన భీకర ఎన్కౌంటర్లలో హిడ్మాను భద్రతా దళాలు హతమార్చాయి.
టీటీడీ కీలక నిర్ణయం.. ఇక, ఆ భక్తుల సౌకర్యాల్లో కోత..! అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా ఏటా 1600 కోట్లు కానుకులు అందుతుండగా.. టన్ను వరకు బంగారం, పది టన్నుల వరకు వెండి కానుకల రూపంలో వస్తోంది. ఇక ఆస్థులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఇప్పటి వరకు శ్రీవారికి 10 రాష్ర్టాలలో 80 వేల కోట్ల రూపాయల ఆస్థులు ఉన్నాయి. మరో వైపు హిందు ధర్మ ప్రచారంలో భాగంగా…
Karumuri Venkata Reddy Arrest: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని వెంకట రెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు.. ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.. అయితే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఏంటి అంటూ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన…
Maoists in Vijayawada: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోవడం వద్ద మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది.. ఈ భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు అతని భార్య హేమ మరో నలుగురు మావోయిస్టు మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రికార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల పైగా రివార్డు ఉంది.. అయితే, మరోవైపు విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి.. నగరంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల…