Maoists Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
Read Also: Tej Pratap Yadav: లాలూ, రబ్రీలను వేధిస్తున్నారు.. దర్యాప్తుకు కుమారుడి డిమాండ్..
ఇక, ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ 15 మందిలో ఐదుగురు మహిళలు ఉండగా పదిమంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఏలూరు నగరానికి వచ్చారా తల దాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
Read Also: PM Modi: మోడీ ధరించిన “వాచ్”పైనే అందరి చూపు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా..
అయితే, అదుపులోకి తీసుకున్న 15 మంది వద్ద 15 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు విచారణ అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. మరోవైపు జిల్లావ్యాప్తంగా మావోయిస్టులు ఇంకెక్కడ అయినా తలదాచుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతం పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.