Karumuri Venkata Reddy Arrest: మరో వైసీపీ నేత అరెస్ట్.. అసలు కారణం ఏంటి..? అని అంబటి ఫైర్
- వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్..
- హైదరాబాద్లోని వెంకట రెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు..
- నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఏంటి అని కుటుంబ సభ్యులు ఆందోళన..
- ప్రభుత్వం, పోలీసుల వ్యవహార శైలిపై అంబటి తీవ్ర ఆగ్రహం
Karumuri Venkata Reddy Arrest: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని వెంకట రెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు.. ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.. అయితే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఏంటి అంటూ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం, పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: Sharwanand : శర్వానంద్ కెరీర్ ను డిసైడ్ చేయనున్న బైకర్..
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
తాడిపత్రికి ఆయనను తీసుకెళ్లారని సమాచారమొస్తోన్నా, అరెస్టుకు సంబంధించిన కారణాలను పోలీసులు వెల్లడించకపోవడం దారుణమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటరెడ్డిపై కక్ష పెట్టుకుని అరెస్టు చేశారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో ప్రభుత్వం పరిశీలించాలి. కానీ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం భయంకరమైన ధోరణి అని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులకు సమాధానం అడిగినా స్పందించకపోవడం ఆందోళనకరం అన్నారు.. ఇక, టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణకు వెళ్తున్న సమయంలో మరణించిన సీఐ సతీష్ కుమార్ ఘటన కూడా అనుమానాస్పదమేనని అంబటి పేర్కొన్నారు. అది హత్యా? ఆత్మహత్యా? ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఆ విషయాన్ని ఎవరైనా మాట్లాడినా అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు..
చంద్రబాబు–లోకేష్ చెప్పితేనే అరెస్టులా? అని నిలదీశారు అంబటి రాంబాబు.. ప్రస్తుతం పోలీసులు రాజకీయ ఆదేశాలకే లోబడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ చెప్పితేనే అరెస్టు చేస్తున్నారా? రాజకీయ నాయకులు మాట్లాడకూడదా?” అని అంబటి ప్రశ్నించారు. సిట్ అధికారులు ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ నేతల మాటనే శాసనంలా తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలు పలుమార్లు హెచ్చరించినా మరి కొంతమంది పోలీసు అధికారులలో మార్పు రాలేదని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వెంకటరెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో, ఎప్పుడు కోర్టులో హాజరు పరుస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
-
Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!