Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Police Strike Major Blow To Maoists 50 Arrested Top Leader Hidma Killed In Encounter Says Ap Intelligence Chief Mahesh Chandra Laddha

Mahesh Chandra Laddha: ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్ట్.. కీలక విషయాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

Published Date :November 19, 2025 , 10:07 am
By Sudhakar Ravula
  • ఏపీలో మావోయిస్టుల కదలికలపై 2 నెలల నుంచి మానిటరింగ్ ఉంది..
  • ఛత్తీస్‌గడ్, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..
  • ఇంటెలిజెన్స్ కి పూర్తి సమాచారం ఉండటంతో ఆపరేషన్ చేశాం..
  • నిన్న ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి..
  • ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిగ్మా ప్రాణాలు కోల్పోయారు..
  • మావోయిస్ట్ షెల్టర్ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయి..
  • 50 మంది మావోయిస్టులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశాం
Mahesh Chandra Laddha: ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్ట్.. కీలక విషయాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mahesh Chandra Laddha: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌తో కలకలం రేగింది.. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగా మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు.. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌ హిడ్మా, ఆయన భార్య హేమ, మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు.. ఇక, మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌, ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్ట్‌లపై విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటిలిజెన్స్ ADG మహేష్ చంద్ర లడ్డా.. కీలక విషయాలను వెల్లడించారు..

Read Also: Maoist Encounter in AP: ఏపీలో మరో ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలపై గత రెండు నెలలుగా కచ్చితమైన నిఘా కొనసాగుతోందని, ఇటీవల జరిగిన సమన్వయ ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో మద్దతు నెట్‌వర్క్ కూలిపోయిందని ఏపీ ఇంటెలిజెన్స్ ADG మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించడంతో, ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో మావోయిస్టు నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఇక, ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేశాం.. మావోయిస్టు చరిత్రలోనే ఇది పెద్ద ఘటనగా పేర్కొన్నారు.. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్వహించిన శోధనల్లో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని లడ్డా చెప్పారు.

Read Also: TSPSC Group-2: సంచలనం.. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..

అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే అని ఆయన వివరించారు లడ్డూ.. ఏపీలో ప్రస్తుతం మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ పూర్తిగా ఆగిపోయిందని, కొంతమంది వారికి సహకరిస్తున్న సానుభూతిపరులను కూడా గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే, మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్‌జీ ఎక్కడ ఉన్నాడన్న విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదని లడ్డా చెప్పారు. అతను ఛత్తీస్‌గఢ్ లేదా తెలంగాణ ప్రాంతంలో దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసినవారు దేవ్‌జీ ప్రొటెక్షన్ టీమ్‌లో భాగమని పేర్కొన్నారు. ఇక, ఏపీలో జరిగిందిది జాయింట్ ఆపరేషన్ కాదు అని క్లారిటీ ఇచ్చారు.. నిన్న జరిగిన ఆపరేషన్ పూర్తిగా ఏపీ పోలీసులే నిర్వహించారని, ఇది ఏ ఇతర రాష్ట్రంతో కలిపి చేసిన ఆపరేషన్ కాదని ఆయన స్పష్టం చేశారు.

మావోయిస్టుల చరిత్రలో మొదటి సంఘటన
ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ కావడం, టాప్ కమాండర్ల మరణం.. ఇది మావోయిస్టుల చరిత్రలో అరుదైన సంఘటనగా పేర్కొన్నారు లడ్డా.. కేంద్ర హోం మంత్రి విధించిన లక్ష్యాల మేరకు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ADG నమ్మకం వ్యక్తం చేశారు. ఏపీలో మావోయిస్టులు ఇప్పుడు లేరు.. ఉన్నవారిని అరెస్ట్ చేశామని వెల్లడించారు మహేష్ చంద్ర లడ్డా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alluri Sitharama Raju Operation
  • Andhra Pradesh
  • Andhra Pradesh Maoist Arrests
  • AP Intelligence Chief Mahesh Chandra Laddha
  • AP Intelligence Reports

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..

  • Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

  • Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?

ట్రెండింగ్‌

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions