AP Liquor Scam Case: మద్యం కేసులో కీలక పరిణామం.. చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు గ్రీన్ సిగ్నల్..!
- ఏపీ మద్యం స్కామ్ కేసులో కీలక పరిణామం..
- చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్కు ప్రభుత్వం అనుమతి..
- మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం..
- అక్రమంగా భారీగా విలువైన అస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన సిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసులో SIT దర్యాప్తు ఆధారంగా, నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SIT నివేదిక ప్రకారం, మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన కమీషన్లు, కిక్బ్యాక్లు మరియు బ్లాక్ మనీ సహాయంతో చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది. అధికారిక రిజిస్ట్రేషన్ విలువను కేవలం రూ.8.85 కోట్లుగా చూపించినప్పటికీ, నిజానికి వాటి విలువ రూ.54.87 కోట్లుగా SIT గుర్తించింది.
Read Also: Wedding video: పెళ్లి వేడుకలో వరుడి మామ పాడుబుద్ధి.. అందరూ చూస్తుండగా డ్యాన్సర్ను ఏం చేశాడంటే..!
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
సిట్ దర్యాప్తు సూచనల మేరకు ప్రభుత్వం క్రింది పేర్లపై ఆస్తుల అటాచ్కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మోహిత్ రెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ (అలియాస్ లక్ష్మి), సీఎంఆర్ ఇన్ఫ్రా పేరుతో ఉన్న ఆస్తులు, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరుతో ఉన్న ఆస్తులు అటాచ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. చెవిరెడ్డి కుటుంబం మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో స్థిర, చర ఆస్తులు విపరీతంగా కొనుగోలు చేసినట్లు SIT పేర్కొంది. రిజిస్ట్రేషన్ విలువను తక్కువగా చూపించి, పెద్ద మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మార్చినట్లు రికార్డులు వెల్లడించాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు, అలాగే నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, మరియు చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు ఉన్నట్లు SIT పేర్కొంది. వెండోడులోని అరబిందో ఫార్మాకు KVS ఇన్ఫ్రా ద్వారా జరిగిన 263.28 ఎకరాల భూమి కొనుగోలు–అమ్మకాల్లో భారీ మోసం జరిగిందని SIT తేల్చింది. ఆ సమయంలో భూమి విలువలు అప్రత్యక్షంగా పెంచి.. పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని వైట్గా మార్చినట్లు నిర్ధారించింది. ఈ ఒక్క లావాదేవీ ద్వారానే KVS ఇన్ఫ్రా రూ.13.3 కోట్లు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చిందని SIT నివేదిక తెలిపింది.
దర్యాప్తు నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం ఆస్తుల అటాచ్కు అనుమతి ఇవ్వాలని SIT ప్రభుత్వంను కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఆస్తుల అటాచ్ కోసం విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతి ఇచ్చింది. డీజీపీ తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జారీ చేశారు.
తాజావార్తలు
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!