AP Liquor Scam Case: మద్యం కేసులో కీలక పరిణామం.. చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు గ్రీన్ సిగ్నల్..!
- ఏపీ మద్యం స్కామ్ కేసులో కీలక పరిణామం..
- చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్కు ప్రభుత్వం అనుమతి..
- మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం..
- అక్రమంగా భారీగా విలువైన అస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన సిట్
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసులో SIT దర్యాప్తు ఆధారంగా, నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SIT నివేదిక ప్రకారం, మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన కమీషన్లు, కిక్బ్యాక్లు మరియు బ్లాక్ మనీ సహాయంతో చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది. అధికారిక రిజిస్ట్రేషన్ విలువను కేవలం రూ.8.85 కోట్లుగా చూపించినప్పటికీ, నిజానికి వాటి విలువ రూ.54.87 కోట్లుగా SIT గుర్తించింది.
Read Also: Wedding video: పెళ్లి వేడుకలో వరుడి మామ పాడుబుద్ధి.. అందరూ చూస్తుండగా డ్యాన్సర్ను ఏం చేశాడంటే..!
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
సిట్ దర్యాప్తు సూచనల మేరకు ప్రభుత్వం క్రింది పేర్లపై ఆస్తుల అటాచ్కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మోహిత్ రెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ (అలియాస్ లక్ష్మి), సీఎంఆర్ ఇన్ఫ్రా పేరుతో ఉన్న ఆస్తులు, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరుతో ఉన్న ఆస్తులు అటాచ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. చెవిరెడ్డి కుటుంబం మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో స్థిర, చర ఆస్తులు విపరీతంగా కొనుగోలు చేసినట్లు SIT పేర్కొంది. రిజిస్ట్రేషన్ విలువను తక్కువగా చూపించి, పెద్ద మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మార్చినట్లు రికార్డులు వెల్లడించాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు, అలాగే నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, మరియు చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు ఉన్నట్లు SIT పేర్కొంది. వెండోడులోని అరబిందో ఫార్మాకు KVS ఇన్ఫ్రా ద్వారా జరిగిన 263.28 ఎకరాల భూమి కొనుగోలు–అమ్మకాల్లో భారీ మోసం జరిగిందని SIT తేల్చింది. ఆ సమయంలో భూమి విలువలు అప్రత్యక్షంగా పెంచి.. పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని వైట్గా మార్చినట్లు నిర్ధారించింది. ఈ ఒక్క లావాదేవీ ద్వారానే KVS ఇన్ఫ్రా రూ.13.3 కోట్లు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చిందని SIT నివేదిక తెలిపింది.
దర్యాప్తు నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం ఆస్తుల అటాచ్కు అనుమతి ఇవ్వాలని SIT ప్రభుత్వంను కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఆస్తుల అటాచ్ కోసం విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతి ఇచ్చింది. డీజీపీ తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జారీ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!