తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్రావు, ఎల్. రమణ, గుత్తా సుఖేందర్రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ…
ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే కనీసం రూ.50 అవుతుంది. సరే ఇంట్లో వండుకుందామని అనుకున్నా ఒక్కొక్కరికి కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుంది. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం వరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఆ హోటల్లో ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నా రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. దోశ, ఇడ్లీ, పూరీ, వడ, ఉగ్గాని ఇలా ఏది తీసుకున్నా…
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద గల ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టమునకు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఒక అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉంది ,తరవాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్ 11, 2021 ఉదయం నాటికి చేరుకుంటుంది. పశ్చిమ మధ్య మరియు దానిని…
ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. అంతకుముందు ఇద్దరు సహాయమంత్రులను కూడా బుగ్గన కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లో ఉందని.. లండన్లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగిందని… ఇప్పుడు రెండో దఫా జరగాల్సి ఉందన్నారు. న్యాయపరమైన అంశాలు కాబట్టి వీటిలో జాప్యం జరుగుతోందని బుగ్గన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. Read Also: వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ…
జాతీయ ప్రాజెక్టైన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగుకు వెళ్లిన ప్రభుత్వం.. సెకీ ఒప్పందం విషయంలో రివర్స్ టెండరింగుకు ఎందుకు వెళ్లడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్రం ఆమోదించిన వారికే టెండర్లు దక్కాయి.. అయినా రివర్స్ టెండరింగుకు వెళ్లిన విషయం ప్రభుత్వం మరిచిందా అని మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ లభిస్తోంటే.. రూ. 2.49కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారోననే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సోలార్ పవర్ కొనుగోళ్ల…
టీటీడీలో జరుగుతోన్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీటీడీలోని 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుకు జనసేనా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఎందుకు విస్మరించారు అంటూ ఫైర్ అయ్యారు.. టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు జనసేనాని.. 2010లో టీటీడీ సూచనల మేరకే 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు.. మరి కొత్తగా ఇప్పుడు…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో…
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కుటుంబాల్లో కన్నీళ్ళు తెచ్చింది. చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిని గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు(35), గడుతూరి తులసి (7), గడుతూరి లాస్య( 5)పాతూని రమణ బాబు (25)గా గుర్తించారు. వీరు నలుగురు కలిసి…
దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పైన కొంత పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే తిరుపతి, శ్రీకాలహస్తి కి భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేసారు. అక్కడ పాత భవానాల్లో, ఇళ్లలో ఎవరు నివాసం ఉండద్దు అని అధికారులు ప్రజలకు సూచించారు. వెస్ట్,డిఆర్ మహల్ అండర్ బ్రిడ్జ్ల వద్ద వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు అమర్చారు. అయితే ఈ…