విశాఖలో విషాదం.. చేపల వేటకు వెళ్ళి నలుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కుటుంబాల్లో కన్నీళ్ళు తెచ్చింది. చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిని గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు(35), గడుతూరి తులసి (7), గడుతూరి లాస్య( 5)పాతూని రమణ బాబు (25)గా గుర్తించారు.
వీరు నలుగురు కలిసి బొంతు వలస కాలువ లో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ ప్రవాహం బాగా పెరిగింది. అక్కడ ఊబి ఉందని తెలియక, నలుగురు ఒక్కసారిగా దిగడంతో అక్కడికక్కడే మృతి చెందారుజ. వారితో వచ్చిన మరో ఒక చిన్నారి ఒడ్డు పైన ఉండడంతో ప్రాణాలతో బయటపడింది. ఆ చిన్నారి జరిగిన ప్రమాదం గురించి చాపరాతి పాలెం గ్రామస్తులకు చేరవేసింది.
Also Read
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అన్వేషించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి ఇద్దరు కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు. అయితే అప్పటికే చీకటి పడటంతో మరొక వ్యక్తి జాడ తెలియలేదు. సోమవారం తెల్లవారుజామున తిరిగి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. విషయం తెలుసుకున్న జీకేవీధి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పంచనామా చేపట్టారు. ఈ ఘటనతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!