ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,768 శాంపిల్స్ పరీక్షించగా.. 320 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 5 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 425 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్ల సంఖ్య 2,97,45,537 కు పెరగగా… మొత్తం…
మీరు మారిపోయార్సార్ అంటున్నారు తమ్ముళ్లు..అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని అనుమాన పడుతున్నారట.అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట.ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు స్టైల్ మారిందా? అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే గగనంగాడే పరిస్థితి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు నడిపించేస్తున్నారట. ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో…
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి లేవనెత్తారు. ఇదే అంశంపై ఇటీవల ఆయన విశాఖలో బహిరంగ సభ నిర్వహించగా.. ఈరోజు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు, పోలీస్ కాల్పుల్లో అమరులైన వారి పేర్లను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమం సమయంలో ఏం జరిగిందో ఆనాటి కొన్ని దినపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ను కూడా పవన్ షేర్ చేశారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన…
రెండు తెలుగు రాష్ట్రాలకు మరో సారి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. శ్రీలంక దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం కొనసాగుతోంది. 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏపీలోనూ రానున్న 24…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఉమాశంకర్రెడ్డి వివేకా పీఏగా పనిచేసిన జగదీశ్వర్రెడ్డి సోదరుడు. ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా… అందులో కీలక విషయాలను వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఉమాశంకర్రెడ్డి రోడ్డుపై పరుగులు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని బ్రిడ్జి…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. పలు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంటే.. ఏపీలోని విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలలో ఇదే అత్యధికం. Read Also:…
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నిరసనలకు పిలుపు ఇవ్వగా.. అధికార పార్టీ వైసీపీ కౌంటర్ ఎటాక్కు దిగింది. బీజేపీ తీరుపై ఏకంగా పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?’ అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.100 దాటించి రూ.5, రూ.10 తగ్గించామని పెంచినోళ్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా? అని నిలదీసింది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. ఏపా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 30,831 శాంపిల్స్ను పరీక్షించగా.. 215 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. అలాగే తాజాగా ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 406 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కారు. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,97,06,769 కు చేరగా.. మొత్తం పాజిటివ్…
పశ్చిమ మధ్య బంగాళా ఖాతం దగ్గరలో ని దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం దగ్గర లోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉన్నది.ఇది సగటు సముద్ర మట్టము నకు 4 .5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్నభూమధ్య రేఖ వద్ద…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఆరోజు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. జడ్పీ లో ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా వైఎస్సార్సీపీ అవడం మాకెంతో ఘనత. వచ్చే పంట రబికి గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం కారణంగా ఆయకట్ట తగ్గుతుందని రైతుల్లో చర్చ జరుగుతుంది.…