Virat Kohli: “మరో స్పెషల్ ఛేజ్కు నేను రెడీ”.. ఐపీఎల్ తొలి మ్యాచ్కు ముందు SRHకు కోహ్లీ మాస్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య ఉండనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 కోసం పూర్తిగా సిద్ధమైంది. మార్చి 28న తమ సొంతగడ్డ (ఎం. చిన్నస్వామి స్టేడియం)పై సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తపడేందుకు ఉర్రూతలూగుతోంది. ఈ మ్యాచ్కు ముందు వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. ఆర్సీబీ సూపర్స్టార్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో విరాట్ ప్రత్యర్థి టీమ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ సారి ప్రత్యేకమైన ఛేజింగ్కు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఈ వీడియో అభిమానుల ఎంతగానో ఉత్సాహ పర్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. “చాలా టీమ్స్లో అద్భుతమైన ప్లేయర్స్ ఉంటారు. కొన్ని టీమ్స్లో ప్రధాన పాత్రధారి ఉంటారు. కానీ.. ఒక టీమ్లో మాత్రం “కింగ్” ఉన్నాడు. కింగ్ తన రాజ్యానికి తిరిగి వస్తున్నాడు.” అంటూ గూస్బంప్స్ తెప్పించే బ్యాగ్రౌండ్ వాయిస్తో వీడియో ప్రారంభమైంది. ఇక ఈ వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “నేను ఈ జెర్సీ వేసుకున్న ప్రతిసారీ నా సర్వశక్తులు ఒడ్డి ఆడతాను. మరో ప్రత్యేకమైన ఛేజ్కు నేను సిద్ధంగా ఉన్నాను.” అని విరాట్ అనడం వీడియోలో కనిపిస్తోంది. “అదే అధ్యాయం, కొత్త కథ. ఎల్లప్పుడూ మీతోనే, మీ విరాట్ కోహ్లీ.” అంటూ చివరిలో విరాట్ కన్నడలో అభిమానుకు మెసేజ్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా, కింగ్ కోహ్లీ బెంగళూరుకు తిరిగి వచ్చాడని, కొత్త కథ రాయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆర్సీబీ స్పష్టమైన సందేశం పంపింది.
READ MORE: SRK : యాక్షన్ జోనర్కు బ్రేక్.. రొమాంటిక్ ఫిల్మ్ చేసే యోచనలో కింగ్ ఖాన్
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ఇక గత సీజన్లో, రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్ను ఓడించి తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఆ ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 191 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ విజయవంతంగా కాపాడుకుంది. విరాట్ కోహ్లీ 43 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్తో విజయానికి పునాది వేశాడు. ఇక ఆర్సీబీతో విరాట్ కోహ్లీ బంధం కేవలం ఒక ఆటగాడిదిగానే కాకుండా, ఒక గుర్తింపుగా మారింది. కోహ్లీ ఇప్పటివరకు ఆర్సీబీ తరఫున 267 ఐపీఎల్ మ్యాచ్లలో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో సహా 8661 పరుగులు సాధించాడు. ఈ సమయంలో కోహ్లీ సగటు 39.54 కాగా, స్ట్రైక్ రేట్ 132.85గా ఉంది. ఐపీఎల్లో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన 2016 సీజన్లో కనబడింది. ఆ సీజన్లో అతను 16 మ్యాచ్లలో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. మరోసారి రికార్డులు బద్దలు గొట్టేందుకు సిద్ధమయ్యాడు.
READ MORE: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!