CM Chandrababu: నాది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం.. అమరావతి దేవతల రాజధాని అవ్వాలి!
- పూజలు చెయ్యను కానీ ఒక నిమిషం సంకల్పం తీసుకుంటా
- హిందువులకు పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి
- అమరావతి దేవతల రాజధాని అవ్వాలని కోరుకున్నా
- షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ఎక్కువ పూజలు చెయ్యను అని, కానీ ఒక నిమిషం సంకల్పం తీసుకుంటా అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అని, హిందువులకు పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. తనది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం అని, అమరావతి దేవతల రాజధాని అవ్వాలని కోరుకున్నా సీఎం చెప్పుకోచ్చారు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పిస్తాయని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేసిన అనంతరం సీఎం మాట్లాడారు.
‘తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. చాలా స్పష్టంగా, అందరికి అర్థమయ్యే విధంగా మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు వారికీ నూతన సంవత్సరం మొదలైంది. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. పంచాంగ శ్రవణం కూడా అందరు చాలా శ్రద్దగా వింటారు. తెలుగు వారి పండగని గౌరవించేలా ఉగాదిని అందరం కలిసి జరుపుకుంటాము. ఈ సంవత్సరంలో 38 మందికి కళారత్న, ఉగాది పురస్కారాలు అందిస్తున్నాము. మనం భూమిని పూజిస్తాము. తల్లి తరువాత మనం జన్మభూమిని పూజిస్తాము.. అలాగే నీటిని పూజిస్తాము. మూడోసారి ముచ్చటగా గోదావరి, కృష్ణా పుష్కరాలు మన ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతుంది. నీటిపై మనం శ్రద్ద పెట్టాము. అందుకే నీటి భద్రతని తీసుకొచ్చాము. అన్ని జలాశయాలు కళకళ లాడుతున్నాయి’ అని సీఎం చెప్పారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
Also Read: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
‘మన ఆచారల్లో నేచురోపతి ఉంది. సూర్య నమస్కారాలు మన ఆచారం. ఆనందంగా ఉంటే సంపద ఉంటుంది. రాబోయే రోజుల్లో పేపర్లో పాలన ఉండదు.. నేను ఎక్కడుంటే అక్కడే ఆఫీస్. ఎక్కడ ఎండ.. ఎక్కడ వడ గాలి చెప్పేయచ్చు. ఎక్కడ వడగండ్ల వాన.. ఎక్కడ పిడుగులు అనేవి ముందే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో టెక్నాలజీ.. ఇదే పరిస్థితిలో ఉంటుంది. ఐటీ ప్రాముఖ్యత 30 ఏళ్ల క్రితమే ఆలోచించా. ఐటీ మన జీవితాల్లో మార్పు తెస్తుంది అని ఎప్పుడో చెప్పా. ఇవాళ గర్వాంగా చెప్పగలుగుతున్నా. ఐటీ చదువుకున్న తెలుగు వారు ప్రపంచం మొత్తంలో ఉన్నారు. డబ్బుతో పాటు విలువలు ఉండాలి. విలువలు లేని రోజు జీవితాలు పతనం అవుతాయి. మన కంటే.. విదేశాల్లో ఉన్న తెలుగు వారు పండగ బాగా చేసుకుంటున్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచం మొత్తంలో పాటిస్తూన్నారు. ఇవాళ తెలుగు జాతి నెంబర్ వన్లో ఉండాలి. తెలుగు ప్రజలు ఒక సంకల్పం చేస్కుందాము. 2047కి తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలి. ఇదే మన సంకల్పం. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ. యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. సంజీవని ప్రాజెక్ట్ లో సెల్ ఫోన్లోనే ఆరోగ్యం.. కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికప్పుడు డేటా ఆన్లైజ్ జరుగుతుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!