Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
వ్యాక్సినేషన్.. నెల్లూరు టాప్.. కర్నూలు లాస్ట్..!
ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. రాష్ట్రంలో కరోనా రోజువారి కేసుల సంఖ్య ఓసారి కిందకు.. మరోసారి పైకి కదులుతూనే ఉంది.. అయితే, కరోనాపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్పై ప్రత్యేకంగా దృష్టిసారించిన సీఎం వైఎస్ జగన్.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తూ.. తగిన ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతం కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల టీకా వేసినట్టు… -
నెల్లూరులో తీరం దాటనున్న తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్కు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.. ఈ సారి నెల్లూరు జిల్లాలో తుఫాన్ తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది… ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం… ఇవాళ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఇవాళ సాయంత్రం తమిళనాడులోని… -
పండగకు ముందే పశ్చిమలో కోడిపందాలు…!
అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తుంది. ఆ ఊళ్లో మాత్రం ఇప్పుడే వచ్చింది. కొబ్బరి తోటల్లో బరులు కట్టించి.. జోరుగా పందాలు మొదలెట్టారు. ఊరి ప్రెసిడెంట్గారు దగ్గరుండి మరీ బెట్టింగులు పెట్టించారు. తోటల్లో మేళం సంగతిని లేటుగా తెలుసుకున్న పోలీసులు, రైడింగులు కూడా చేశారు. అసలు విషయం ఏంటంటే.. బరుల దగ్గర అరెస్టైన వాళ్లు.. స్టేషన్కు వచ్చే సరికి గాయబ్ అయ్యారు. ఎందుకిలా? అని ఆరాతీస్తే తెలిసింది. ప్రెసిడెంట్గారు అధికారపార్టీ ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ అని. ఇంతకీ ఆ… -
విశాఖలో ఐటీ దాడుల కలకలం..
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలే టార్గెట్గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. భువనేశ్వర్ సహా పలు ప్రాంతాల నుంచి ఐటీ అధికారుల టీమ్ విశాఖకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నగరంలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో ప్రముఖ బిల్డర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది… -
పెనుకొండ పురపోరుపై పెరిగిన ఉత్కంఠ…!
ఎన్నికలొచ్చాయంటే.. రాజకీయ పార్టీల వ్యూహాలు ఒక యుద్ధాన్ని తలపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ మంత్రి నియోజవర్గంలో జరుగుతున్న పురపోరులో అంతకు మించిన వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ ఒక ప్లాన్లో వెళ్తే.. వైసీపీ నేతలు బహుముఖ వ్యూహాంతో వెళ్తున్నారు. ఒక చిన్న మున్సిపాల్టీ కోసం అంత ఎఫర్ట్ అవసరమా.. ఎందుకు వైసీపీ అంత ఛాలంజింగ్ గా తీసుకుందీ అన్నది ఆసక్తికరంగా మారింది. అనుకోకుండా వచ్చిన పెనుకొండ మున్సిపల్ ఎన్నికల ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచేస్తోంది. కుప్పం… -
2 రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా.. 50 శాతం స్థానాలు వారికే..
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.. ఇక, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరగనున్న మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్లోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.. అయితే, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తామని… -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్లోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా జారీ చేశారు.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేసి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, ఈ ఎన్నికలకు సిద్ధమైపోతోంది అధికార… -
టీడీపీ నేతలే దాడి చేశారు.. వీడియోలు కూడా ఉన్నాయి..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఇక, కుప్పం మున్సిపల్ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. కుప్పంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందని చెప్పి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. 14వ వార్డులో ప్రపోజర్ విత్ డ్రా చేయడం వల్ల ఓ నామినేషన్ తిరస్కరణకు గురై మా అభ్యర్థి ఏకగ్రీవంగా… -
ఏపీ కరోనా అప్డేట్.. మళ్లీ భారీగా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,244 శాంపిల్స్ను పరీక్షించగా.. 348 మందికి కరోనా పాజిటివ్గా తేలింది… మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందరు.. చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందినట్టు బులెటిన్లో పేర్కొంది ఏపీ సర్కార్. ఇదే సమయంలో 358 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి… -
మంత్రి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు.. మీ ఇద్దరి తోలు ఒలిచి సీఎంకు చెప్పులు కుట్టిస్తా..!
చంద్రబాబు, నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని.. లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సంచలన కామెంట్లు చేశారు.. సీఎంను దున్నపోతు అంటూ లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రి ఇంటిని తాకుతా అంటున్నాడు.. రా.. నా కొడకా… ముఖ్యమంత్రి ఇంటి గుమ్మాన్ని తాకు… చూస్తా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక, లోకేష్, చంద్రబాబు తోలు ఒలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చెప్పులు కుట్టిస్తా అంటూ సంచలన…
తాజావార్తలు
-
B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
-
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
-
Vishwambhara : ‘పెద్ది’ అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
-
Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
-
Hardik Pandya: ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఔట్.. వైఫల్యాన్ని నిజాయితీ ఒప్పుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!