వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ నేత పట్టాభి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో కూడా పసుపు నాయకుడిగా తాను మాట్లాడుతున్నానని… తాను వెనకడుగు వేసే ప్రస్తక్తే లేదన్నారు.
Read Also: విశాఖలో విషాదం.. చేపల వేటకు వెళ్ళి నలుగురి మృతి
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏ స్థాయిలో ఉన్న నేత తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా ఆధారాలతో సహా బయటపెట్టడమే తన పని అని టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచకాలను తట్టుకుని పోరాడుతున్న టీడీపీ శ్రేణులకు హ్యాట్సాఫ్ చెప్పాలిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యధిక పన్ను వసూలు చేస్తోందని ఏపీనేనని పట్టాభి ఆరోపించారు. ఈ విషయం తాను అనడం లేదని.. స్వయంగా కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రే చెప్పారని.. ఆయనకు సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్పై తమ ప్రభుత్వం ఎలాంటి పన్ను పెంచలేదని.. కేవలం రోడ్ల సెస్ కింద రూపాయి మాత్రమే తీసుకుంటున్నామంటూ సిగ్గులేకుండా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఏపీలో రూ.28వేల కోట్ల రూపంలో పెట్రోల్, డీజిల్పై పన్నులు వసూలు చేశారని.. మళ్లీ దీనికి అదనంగా రోడ్ల సెస్ పేరుతో లీటరుకు రూపాయి వసూలు చేస్తున్నారని పట్టాభి విమర్శలు చేశారు. ఇప్పటివరకు తనపై వైసీపీ వాళ్లు మూడు సార్లు దాడులు చేశారని.. అయినా వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!