టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒంగోలు వెళ్లనున్నారు.. మూడు రోజుల పాటు అక్కడే బసచేయనున్నారు.. ఇవాళ ఒంగోలు వెళ్లనున్న ఆయన.. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొననున్నారు.. ఇక, చంద్రబాబు పర్యటన సందర్భంగా… విజయవాడ నుండి ఒంగోలు వరకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యాయి టీడీపీ శ్రేణులు… ఆ బైక్ ర్యాలీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా సరిహద్దు మార్టూరు నుండే స్వాగత ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు.. మధ్యాహ్నం వరకు చంద్రబాబు ఒంగోలు చేరుకోనుండగా..…
టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజ్లో ఫైరయ్యారు. అమలాపురం ఘటన దురదృష్టకరం, ఈ ఘటనను ఖండిస్తున్నాం అన్న మాట పవన్ నోటి నుంచి రాలేదని అంబటి ఆరోపించారు. ప్రభుత్వం ఉక్కుపాదంతో అల్లర్లను అణచివేయాలని పవన్ ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. దాడులను ఖండించకుండా పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోనసీమ జిల్లా మార్పు అంశంలో గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ వారు ఎందుకు నిరాహార దీక్షలు చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రజల నుంచి డిమాండ్…
కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికే ఈ హత్య కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. Konaseema: కోనసీమలో మళ్లీ మొదలైన టెన్షన్.. షాపులన్నీ క్లోజ్ అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను…
కోనసీమ జిల్లా మార్పు అంశంలో అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను పవన్ కళ్యాణ్ చదివారని ఆమె ఆరోపించారు. కోనసీమ కోసం ఆత్మహత్య చేసుకుంటానన్న అన్యం సాయి అనే వ్యక్తి జనసేన కార్యకర్తేనని రోజా విమర్శలు చేశారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని గతంలో ప్రతిపక్షాలు అంగీకరించాయని ఆమె గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదని…
కోనసీమ జిల్లా పేరు మార్పుతో రగడ జరుగుతోంది. దీంతో అమలాపురం అట్టుడుకుతోంది. అయితే అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వ్యక్తి అన్యం సాయి అని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడు గతంలో కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు వివరిస్తున్నారు. అయితే అన్యం సాయి వైసీపీకి చెందిన వ్యక్తి అంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అతడు గతంలో ప్రభుత్వ ముఖ్య…
ఒంగోలు సమీపంలో టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం మహానాడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంటే వైసీపీకి కడుపు మంటగా ఉందని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక గడపగడపకు వెళితే జనం మొహం మీద కొడుతున్నారని ఎద్దేవా చేశారు. MLA…
ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్లో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్తో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు విశాఖలోని తన ప్లాంట్ విస్తరణ నిమిత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆదిత్య మిట్టల్ అంగీకరించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఇటీవల గ్రీన్ కో నేతృత్వంలో ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్…
ప్రజా ప్రతినిధులంతా ప్రజల వద్దకు వెళ్లేలా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలనుంచి ప్రజా ప్రతినిధులకు నిరసన తప్పడంలేదు, తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరులో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్ను నిలదీశారు ఓ వృద్ధురాలు.. సీఎం జగన్ వచ్చాక అన్నీ ఇస్తున్నాడు.. కానీ, అన్ని ధరలు పెంచాడని ఆ వృద్ధురాలు నిలదీసింది ఆమె. Read Also: Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ని “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చేయండి..!…
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం తీవ్ర విధ్వంసానికి దారితీసింది.. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు జోడించడంపై ఓ వర్గం ఆందోళన చేస్తుండగా.. అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళితసంఘాలు నిరసనకు దిగుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేయాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. అంటూ…
అమలాపురంలో విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలను గుర్తించేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తించినట్టుగా తెలుస్తుండగా… ఈ ఘటనలో 7 కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. నిన్నటి ఘటనకి సంబంధించిన 7 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. ప్రస్తుతం 1000…