కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో ఒక్కసారిగా అమలాపురం అట్టుడికిపోయింది.. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు… మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇక, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.. దీంతో, అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, నిన్నటి ఘటనలో పాల్గొన్నవారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.. ఆందోళనకారులను గుర్తించే పనిలో పడింది విశాల్ గున్ని…
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటన వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా… కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, అన్ని పార్టీలు కోరాయన్న ఆయన.. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్లే ఉన్నారు.. రాష్ట్రానికి విలన్ చంద్రబాబే అంటూ మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్, ఎన్టీఆర్,…
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు జోడించడంపై పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇది అమలాపురంలో విధ్వంసానికి దారి తీసింది.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పుపెట్టేవరకు వెళ్లింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వైసీపీకి అంబేద్కర్ పట్ల ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుగా..? అని ప్రశ్నించారు. అంబేద్కర్ దేశానికి దైవం.. కోనసీమలో హింసను ఖండిస్తున్నామన్న ఆయన.. కోనసీమ ఆందోళనల్లో బీజేపీ నేతలెవ్వరూ పాల్గొనలేదన్నారు. అంబేద్కర్ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి…
కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా.. చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.. ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.. టూవీలర్లపై వస్తున్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.. అమలాపురంలోకి ఎంట్రీ ఇచ్చే వాహనదారులు వివరాలు మొత్తం సేకరిస్తున్నారు.. ఇక, రోడ్లపైకి వచ్చే ఆందోళన చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. అమలాపురంలో పరిస్థితి అదుపులోనే ఉందన్న ఆయన.. విధ్వంస చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం…
కోనసీమ జిల్లా పేరు వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారిపోయింది.. ఆ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.. విధ్వంసం సృష్టించింది. మరోవైపు ఇవాళ కూడా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. ఇప్పటికే అమలాపురంలో కఠిన ఆంక్షలు విధించారు. బయట ప్రాంతాల నుంచి ఎవ్వరినీ అమలాపురంలోకి రానివ్వడంలేదు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు.. ఆర్టీసీ సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇక, కోనసీమకు సీనియర్ ఐపీఎస్లను పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Read Also: Dowry harassment:…
తిరుపతిలోని ముదివేడు పోలీస్స్టేషన్ ఎస్ఐపై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది.. రూ.10 లక్షల అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురానికి రావాలని భార్యను వేధించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండల ముదివేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న సుకుమార్… భార్యను గన్తో కాల్చ తానని బెదిరించడం వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఎస్ఐ సుకుమార్ భార్య విష్ణు ప్రియ ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు…
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.. అన్ని నెట్వర్క్ లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉన్నా.. మళ్లీ చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. నిన్న జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులు చక్కబడే వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అన్ని నెట్వర్క్లను ఆదేశించారు పోలీసు అధికారులు.. ఇక, వివిధ ప్రాంతాల…
కోనసీమ జిల్లా పేరు మార్చడం.. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నిన్న విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, ఈ ఆందోళలనపై మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.. అన్ని వర్గాల సూచన, కోరిక మేరకే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చటం జరిగిందన్న ఆయన.. అంబేద్కర్ ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వాడు కాదు.. అంబేద్కర్…
కోనసీమ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ముఖ్యంగా అమలాపురం అయితే అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది.. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు.. అయితే, అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుండి భారీగా అమలాపురం చేరుకున్నారు పోలీసులు.. రాత్రి నుంచి అమలాపురంలో వర్షం కూడా కురుస్తుండడంతో.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అక్కడే మకాం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏలూరు డీఐజీ పాలరాజు..…
పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా.. గెలుపుపై గ్యారంటీ ఉన్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఎన్నికల్లో ఆయన ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా.. ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినా గెలుపు సొంతం చేసుకుంటారు. వైసీపీ ప్రభంజనం సృష్టించిన 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత గంటా…