Janasena Party: ‘జనవాణి’ పేరుతో కొత్త కార్యక్రమం.. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించింది.
Read Also: Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
రెండో ఆదివారం కూడా విజయవాడలోనే జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన పార్టీ వెల్లడించింది. అయితే మూడో ఆదివారం, నాలుగో ఆదివారం, ఐదో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని వరుసగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని.. జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తామని.. అదే రోజు సాయంత్రానికి సదరు సమస్యలను సంబంధిత అధికారులకు చేరేవేసేందుకు ప్రయత్నిస్తామని జనసేన పార్టీ వివరించింది. తమ కేంద్ర కార్యాలయం నుంచి అర్జీల పురోగతిని ఫాలో అప్ చేస్తామని చెప్పింది. కాగా ప్రజల విశ్వాసాన్ని బలపరిచేలా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపడతామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేలా, సామాన్యుడి గళానికి బలానిచ్చేలా జనవాణి కార్యక్రమం ప్రారంభించనున్న @JanaSenaParty
ఈ కార్యక్రమం ద్వారా రానున్న 5 ఆదివారాల్లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు స్వయంగా ప్రజల విజ్ఞప్తులను స్వీకరించనున్నారు.#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/YeHFn2vTXW
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2022
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!