Janasena Party: ‘జనవాణి’ పేరుతో కొత్త కార్యక్రమం.. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించింది.
Read Also: Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
Also Read
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
రెండో ఆదివారం కూడా విజయవాడలోనే జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన పార్టీ వెల్లడించింది. అయితే మూడో ఆదివారం, నాలుగో ఆదివారం, ఐదో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని వరుసగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని.. జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తామని.. అదే రోజు సాయంత్రానికి సదరు సమస్యలను సంబంధిత అధికారులకు చేరేవేసేందుకు ప్రయత్నిస్తామని జనసేన పార్టీ వివరించింది. తమ కేంద్ర కార్యాలయం నుంచి అర్జీల పురోగతిని ఫాలో అప్ చేస్తామని చెప్పింది. కాగా ప్రజల విశ్వాసాన్ని బలపరిచేలా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపడతామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేలా, సామాన్యుడి గళానికి బలానిచ్చేలా జనవాణి కార్యక్రమం ప్రారంభించనున్న @JanaSenaParty
ఈ కార్యక్రమం ద్వారా రానున్న 5 ఆదివారాల్లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు స్వయంగా ప్రజల విజ్ఞప్తులను స్వీకరించనున్నారు.#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/YeHFn2vTXW
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2022
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!