Janasena Party: ‘జనవాణి’ పేరుతో కొత్త కార్యక్రమం.. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించింది.
Read Also: Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
Also Read
రెండో ఆదివారం కూడా విజయవాడలోనే జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన పార్టీ వెల్లడించింది. అయితే మూడో ఆదివారం, నాలుగో ఆదివారం, ఐదో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని వరుసగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని.. జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తామని.. అదే రోజు సాయంత్రానికి సదరు సమస్యలను సంబంధిత అధికారులకు చేరేవేసేందుకు ప్రయత్నిస్తామని జనసేన పార్టీ వివరించింది. తమ కేంద్ర కార్యాలయం నుంచి అర్జీల పురోగతిని ఫాలో అప్ చేస్తామని చెప్పింది. కాగా ప్రజల విశ్వాసాన్ని బలపరిచేలా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపడతామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేలా, సామాన్యుడి గళానికి బలానిచ్చేలా జనవాణి కార్యక్రమం ప్రారంభించనున్న @JanaSenaParty
ఈ కార్యక్రమం ద్వారా రానున్న 5 ఆదివారాల్లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు స్వయంగా ప్రజల విజ్ఞప్తులను స్వీకరించనున్నారు.#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/YeHFn2vTXW
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2022
తాజావార్తలు
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!