Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!
- టీమిండియాలో పెను మార్పులు
- రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి
- యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India ODI Squad Changes for 2027 ODI World Cup: భారత వన్డే జట్టులో త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు భవిష్యత్తులో భారత జట్టు వన్డే ప్రణాళికల్లో ఉండకపోవచ్చని సమాచారం. 2027 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ సెలెక్టర్లు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత వన్డే జట్టు ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట.
2027 వరల్డ్ కప్ కోసం అత్యున్నత భారత జట్టును సిద్ధం చేయాలనే ఉద్దేశంతో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే తన చివరి వన్డే మ్యాచ్ ఆడేసి ఉండొచ్చని కూడా క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జట్టు యాజమాన్యం ఇప్పుడు యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టాలని భావిస్తోందట. అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ ఇప్పటికే నిరూపించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో దూబే అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.
Also Read
- AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
- IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
- Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
- David Warner: మూడు గ్లాసుల మందు... కుటుంబంతో ప్రయాణం.. స్టార్ క్రికెటర్కు కోర్టు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
Also Read: AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
మరోవైపు 2027 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్లపై వేగం, బౌన్స్ కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వికెట్కీపర్ బ్యాట్స్మెన్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. గాయాలు, ఫిట్నెస్, ఫామ్ లేని రిషబ్ పంత్ మెగా టోర్నీకి దాదాపుగా దూరమయినట్లే. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడుతారు. దాంతో కేఎల్ రాహుల్ కూడా అనుమానమే. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, టపార్డర్లో ఆడుతారు. శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, సంజు శాంసన్, ఇషాన్ కిషన్లు మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. మొత్తానికి టీమిండియా వన్డే జట్టులో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువ ఆటగాళ్లతో కొత్త జట్టును తయారు చేసి 2027 వరల్డ్ కప్కు సిద్ధం కావాలనే లక్ష్యంతో బీసీసీఐ ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!