Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!
- టీమిండియాలో పెను మార్పులు
- రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి
- యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India ODI Squad Changes for 2027 ODI World Cup: భారత వన్డే జట్టులో త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు భవిష్యత్తులో భారత జట్టు వన్డే ప్రణాళికల్లో ఉండకపోవచ్చని సమాచారం. 2027 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ సెలెక్టర్లు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత వన్డే జట్టు ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట.
2027 వరల్డ్ కప్ కోసం అత్యున్నత భారత జట్టును సిద్ధం చేయాలనే ఉద్దేశంతో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే తన చివరి వన్డే మ్యాచ్ ఆడేసి ఉండొచ్చని కూడా క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జట్టు యాజమాన్యం ఇప్పుడు యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టాలని భావిస్తోందట. అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ ఇప్పటికే నిరూపించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో దూబే అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.
Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్పై భారత్ 19-0తో సంచలన విజయం.!
Also Read: AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
మరోవైపు 2027 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్లపై వేగం, బౌన్స్ కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వికెట్కీపర్ బ్యాట్స్మెన్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. గాయాలు, ఫిట్నెస్, ఫామ్ లేని రిషబ్ పంత్ మెగా టోర్నీకి దాదాపుగా దూరమయినట్లే. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడుతారు. దాంతో కేఎల్ రాహుల్ కూడా అనుమానమే. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, టపార్డర్లో ఆడుతారు. శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, సంజు శాంసన్, ఇషాన్ కిషన్లు మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. మొత్తానికి టీమిండియా వన్డే జట్టులో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువ ఆటగాళ్లతో కొత్త జట్టును తయారు చేసి 2027 వరల్డ్ కప్కు సిద్ధం కావాలనే లక్ష్యంతో బీసీసీఐ ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?