భారత్ 2075 నాటికి జపాన్, జర్మనీ, అమెరికాలను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
4 Indian-Origin Women in List Of Americas Richest Self-Made Women: అమెరికాలో తమదైన ముద్ర (స్వయంకృషితో ఎదిగిన మహిళలు) వేసిన తొలి 100 మంది సంపన్న మహిళల జాబితాను ‘ఫోర్బ్స్’ విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలకు చోటు దక్కింది. పెప్సికో మాజీ ఛైర్మన్, సీఈఓ ఇంద్రా నూయీ.. ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్.. సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా…
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయింది.
రసాయన ఆయుధాలతో భయాందోళనలు లేని ప్రపంచానికి ఒక అడుగు దగ్గరకు తీసుకువచ్చామని అమెరికా అధ్యక్షులు బిన్ జోబైడెన్ అన్నారు. రసాయన ఆయుధాల నిల్వలో ఉన్న చివరి మందుగుండు సామగ్రిని యునైటెడ్ స్టేట్స్ సురక్షితంగా నాశనం చేసిందని .. అందుకు తాను గర్వపడుతున్నానని బైడెన్ అన్నారు.
USA: మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల కన్వెన్షన్ ప్రకారం అమెరికా తన దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసిందని అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసినందుకు గర్వపడుతున్నానని.. రసాయన ఆయుధాలు భయం లేని ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు దగ్గర చేసిందని బైడెన్ చెప్పారు.
Ram Gopal Varma says Jai Balayya: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రీసెంట్ గా 20 ఏళ్ళ తరువాత అమెరికా నాటా వేడుకకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లిన రాంగోపాల్ వర్మ ట్రిప్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు అయితే కలకలం రేపుతున్నాయి. ముందుగా “నాటా నిర్వాహకులు నా అమెరికా ట్రిప్ను ఎంతో బాగా హ్యాపీ గా సాగేలా చేశారు, అమెరికా నాకెంతో ఇష్టం. అలాగే అమెరికాకు…
USA: అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన పునరావృతం అయింది. భర్త అరెస్టును రికార్డు చేస్తున్న ఓ నల్లజాతి మహిళపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను నేలపైకి తోసి, మోకాలితో ఆమెను తొక్కేసి దాడి చేశారు. ఆమె కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఈ ఘటన లాస్ ఏంజెలెస్ లోని లాంకాస్టర్ ప్రాంతంలో వింకో గ్రాసరీ స్టోర్ సమీపంలో జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది.
అమెరికాలో తుపాకీ సంస్కృతి మళ్లీ బుసలు కొట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజున కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల్లోనే 8మంది దాకా ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. మరో 28మంది దాకా గాయపడ్డారు.
భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 17.01 సెల్సియస్కు చేరుకుందని వెల్లడించింది.