President Murmu: పశ్చిమ బెంగాల్లో ప్రోటోకాల్ ఫైట్.. మమతా బెనర్జీ సర్కార్ను ఏకిపారేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Murmu: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. బెంగాల్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం జరిగిన ‘అంతర్జాతీయ సంతాలీ సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పర్యటనకు వస్తే కనీసం ముఖ్యమంత్రి గానీ, ఆమె క్యాబినెట్ మంత్రులు గానీ స్వాగతం పలికేందుకు రాకపోవడంపై ముర్ము ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “మమతా బెనర్జీ నాపై ఏమైనా అసంతృప్తితో ఉన్నారా? అందుకే ఎవరూ రాలేదా?” అని ఆమె ప్రశ్నించారు.
READ ALSO: దేశంలో ఇంధన కొరత..! HPCL కీలక ప్రకటన..
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఈ సదస్సును ముందుగా బిధాన్నగర్లో నిర్వహించాల్సి ఉండగా, చివరి నిమిషంలో గోషాయిపూర్కు మార్చడంపై ఆమె మండిపడ్డారు. అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, జనం తక్కువగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో కేంద్రం గిరిజనులకు కొత్త గుర్తింపునిచ్చిందని చెబుతూనే.. బెంగాల్లోని సంతాలీలు, ఇతర గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని ఆమె విమర్శించారు. గిరిజనులు ఏకం కావడం, చదువుకోవడం కొందరికి ఇష్టం లేదని ఆమె పరోక్షంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ (X) వేదికగా స్పందించారు. రాష్ట్రపతి పట్ల మమతా ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగ మర్యాదలను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. బెంగాల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందనడానికి ఇదొక నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. కోల్కతాలో ఓ నిరసన కార్యక్రమంలో ఉన్న ఆమె.. రాష్ట్రపతి పదవికి తగని రీతిలో ముర్ము రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. “రాష్ట్రపతి కేవలం ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడటం సరికాదు. బెంగాల్లోని అన్ని వర్గాలను మీరు చూడాలి. మీ వద్దకు మా ఎంపీలను పంపిస్తాం, గిరిజనుల కోసం మేం చేసిన అభివృద్ధి పనుల వివరాలను వారు మీకు సమర్పిస్తారు” అని మమత పేర్కొన్నారు. టీఎంసీ పార్టీ కూడా దీనిపై స్పందిస్తూ.. గిరిజనుల అభివృద్ధిపై రాష్ట్రపతికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది.
READ ALSO: Veg Fish Curry: చేప లేని ‘చేపల పులుసు’.. అదిరిపోయే టేస్ట్! ఇలా చేసుకోండి..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?